Don't Miss!
- News తెర మీదకు వివేకానందరెడ్డి రెండో భార్య..వీడియో వైరల్
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
ప్రతిష్ఠాత్మక చిత్రంలో సంపూ.. హీరోయిన్గా రష్మిక మందన్న
హృదయకాలేయంతో సెన్సేషనల్ సక్సెస్ అందుకొన్న సంపూర్ణేష్బాబు ఆ తర్వాత ఆఫర్ల రేసులో వెనుకపడ్డారు. మధ్యలో కొన్ని సినిమాల్లో అతిథి పాత్రల్లో మెరిసినప్పటికీ అంతగా పేరు రాలేదు. ప్రస్తుతం ఆయన నటించిన కొబ్బరిమట్ట సినిమా రిలీజ్కు సిద్ధమవుతున్నది. అయితే కొబ్బరిమట్ట రిలీజ్కు ముందే సంపూర్ణేష్ బాబుకు మంచి అవకాశం తలుపుతట్టింది.
ప్రస్తుతం నాగార్జున, నాని కాంబినేషన్లో దర్శకుడు శ్రీరామ్ అదిత్య రూపొందించే చిత్రంలో ఓ కీలకపాత్రను పోషిస్తున్నట్టు సమాచారం. పాత్ర పరిధి చిన్నదైనప్పటికీ సంపూకి మంచి పేరు వస్తుందని చిత్ర యూనిట్ పేర్కొంటున్నారు.
కాగా, ఈ చిత్రంలో కన్నడ హీరోయిన్, ఛలో ఫేం రష్మిక మందన హీరోయిన్గా ఎంపిక చేసినట్టు తెలిసింది. ఈ సినిమాలో నాగార్జున డాన్గా, నాని డాక్టర్ పాత్రల్లో నటిస్తున్నట్టు చిత్ర యూనిట్ వర్గాలు వెల్లడించాయి. అశ్వినీదత్ నిర్మించే ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.