Don't Miss!
- Automobiles మండే వేసవిలో ట్రాఫిక్ పోలీసులకు చల్లచల్లని ఏసీ హెల్మెట్లు.. ఎక్కడో తెలుసా.??
- News డబ్బులేమైనా చెట్లకు కాస్తాయా?: ఉచితాలపై వెంకయ్య నాయుడు
- Finance Gold Rate: గుడ్న్యూస్.. కుప్పకూలిన పసిడి ధర.. నేడు రూ.15,300 తగ్గిన గోల్డ్ రేటు..
- Travel Hanuman Jayanti 2024 : ఢిల్లీలోని ఈ పురాతన హనుమాన్ దేవాలయాలను చూడాల్సిందే..!
- Sports జైస్వాల్.. వాళ్లపై ఎందుకంత కక్ష?- సునీల్ గవాస్కర్
- Lifestyle Mango Tea: ఇకపై తొక్కేకదా అని పారేయకండి.. ఇలా టీ చేసుకుని తాగండి..శరీరంలో జరిగే అద్భుతాలు చూడండి..
- Technology శాంసంగ్ స్మార్ట్ఫోన్ డిస్ప్లేలో గ్రీన్ లైన్ కనిపిస్తోందా.. అయితే ఉచితంగా స్క్రీన్ రీప్లేస్ చేస్తారు...
విశాల్ చేతిలో ఓటమి అనంతరం శరత్ కుమార్ కామెంట్!
హైదరాబాద్: తమిళ సినీ నటుల సమాఖ్య ‘నడిగర్ సంఘం' ఎన్నికలు ఎంత రసవత్తరంగా సాగాయో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఎన్నికల ముందు హోరా హోరీ విమర్శలతో ఎన్నికల వేడి రాజకీయవాతావరణాన్ని తలపించింది. ఒకానొక సమయంలో ఇరు వర్గాలు వ్యక్తిగత విమర్శలు... కుక్క, నక్క అంటూ నిందించుకోవడం చూసి సినీ ప్రేక్షకులు సైతం నివ్వెర పోయారు.
ఈ నెల 18న జరిగిన ఎన్నికల్లో శతర్ కుమార్ జట్టు..... నాజర్-విశాల్ జట్టు చేతిలో ఓటమి పాలైంది. ఓటమి అనంతరం నడిగర్ సంఘం మాజీ అధ్యక్షుడిగా మారిపోయిన శరత్ కుమార్ మాట్లాుతూ...ఎన్నికల సందర్భంగా విశాల్ జట్టు తనపై చేసిన ఆరోపణలు, అవినీతి నిందలు తన మనసుని తీవ్రంగా గాయపరిచాయని, తాను పరిశుద్ధుడిని మీడియా ముఖంగా ప్రకటించారు. ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షుడిగా 15 ఏళ్లు నడిగర్ సంఘం అభివృద్ధి కోసం, నటీనటుల సంక్షేమం కోసం పాటుపడ్డానని, 33 ఏళ్లుగా సినీ రంగంలో ఉన్న తాను ఏనాడూ తప్పు చేయలేదని, నడిగర్ సంఘం వ్యవహారంలోనూ ఎ లాంటి తప్పు జరగలేదని స్పష్టం చేసారు.
నడిగర్ సంఘం ఎన్నిలకు ప్రధాన కారణమైన ఎస్పీఐ సినిమాస్తో ఒప్పందాన్ని ఎన్నికలకు ముందే రద్దు చేసినట్లు ప్రకటించారు. ఎస్పీఐతో సంప్రదింపులు జరిపి సెప్టెంబర్ 29వ తేదీన ఒప్పందం రద్దుపై నిర్ణయం తీసుకున్ననట్లు చెబుతూ అందుకు సంబంధించిన పత్రాలను చెన్నైలో సోమవారం సాయంత్రం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఎన్నికల ముందే ఈ విషయాన్ని ప్రకటించి ఉంటే నిజంగానే తాను తప్పు చేశానని అందరూ భావించి ఉండేవారని, తమ తొలి విజయంగా పాండవర్ ప్రచారం చేసేదని, అందుకే ఈ విషయాన్ని ఇపుడు వెల్లడిస్తున్నట్లు తెలిపారు.
10 రోజుల్లోపు సంఘం ఆడిట్ లెక్కలన్నీ నూతన కార్యవర్గానికి అప్పగిస్తానన్నారు. ఎస్పీఐతో ఒ ప్పందం అత్యుత్తమ ఆదాయ వనరుగా ఎప్ప టికీ తాను విశ్వసిస్తానని, ఈ విషయంలో కొత్త సభ్యులు పునరాలోచన చేయాలని సూచించా రు. ఏదేమైనా నాజర్, విశాల్, కార్తి నేతృత్వంలోని కొత్త కార్యవర్గం చేపట్టే చర్యలకు తన పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు.