Sarkaru Vaari Paata: రిలీజ్ రోజే మహేశ్కు బిగ్ షాక్.. ఇదంతా ఆ ఫ్యాన్స్ పనే అని అనుమానం
తెలుగు సినీ ఇండస్ట్రీలో యాక్టింగ్, ఫైట్స్, డ్యాన్స్, డైలాగ్స్ అన్నింటికీ మించి హ్యాండ్సమ్ లుక్స్తో ప్రేక్షకులను అలరిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను సొంతం చేసుకుని బడా హీరోగా ఎదిగిపోయాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. కెరీర్ ఆరంభంలోనే స్టార్డమ్ను సొంతం చేసుకున్న అతడు.. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూడకుండా దూసుకెళ్తున్నాడు.
Recommended Video

ఈ క్రమంలోనే ఈ మధ్య కాలంలో ఏకంగా మూడు బ్లాక్ బస్టర్ హిట్లను కొట్టి సత్తా చాటాడు. ఆ ఉత్సాహంతోనే ఇప్పుడు మహేశ్ బాబు 'సర్కారు వారి పాట' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకు రిలీజ్ రోజే బిగ్ షాక్ తగిలింది. అసలేం జరిగింది? దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం!

సర్కారు వారి పాటతో మహేశ్ ఎంట్రీ
సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన తాజా చిత్రమే ‘సర్కారు వారి పాట'. పరశురాం పెట్ల తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటించింది. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలతో కలిసి మహేశ్ స్వయంగా నిర్మించాడు. ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతాన్ని అందించాడు. ఇందులో సముద్రఖని విలన్గా నటించారు.

అంచనాలకు తగ్గట్లుగా ప్రీ బిజినెస్
వరుస విజయాల తర్వాత మహేశ్ బాబు నటించిన సినిమా కావడంతో ‘సర్కారు వారి పాట'పై ఆది నుంచే అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీని నుంచి విడుదలైన టీజర్, పాటలు, ట్రైలర్కు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఇది మరింత క్రేజ్ను అందుకుంది. ఫలితంగా దీనికి అన్ని ప్రాంతాల్లో కలిపి రూ. 120 కోట్ల బిజినెస్ జరిగింది.

గ్రాండ్ రిలీజ్.. థియేటర్లు సందడి
విడుదలకు ముందే భారీ హైప్ క్రియేట్ చేసుకున్న ‘సర్కారు వారి పాట' మూవీ ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీన్ని ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 2150కు పైగా థియేటర్లలో విడుదల చేస్తున్నారు. దీంతో అన్ని థియేటర్లూ ప్రేక్షకులతో కళకళలాడుతున్నాయి. మరీ ముఖ్యంగా ఏపీ, తెలంగాణలోని సినిమా హాళ్లన్నీ మెగా అభిమానులతో రచ్చతో సందడిగా మారిపోయాయి.

అంతటా విడుదల.. అలాంటి టాక్
క్రేజీ కాంబినేషన్లో రూపొందిన ‘సర్కారు వారి పాట' మూవీకి సంబంధించి ఇప్పటికే ఓవర్సీస్ సహా తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో షోలు ప్రదర్శితం అయిపోయాయి. అన్ని చోట్లా దీనికి మంచి స్పందన దక్కింది. దీంతో షోలన్నీ హౌస్ఫుల్ అయిపోయాయి. అయితే, టాక్ మాత్రం మిశ్రమంగా వస్తోంది. కొందరు ఈ సినిమా బాగుందని అంటే.. మరికొందరు ఏవరేజ్ అంటున్నారు.

విడుదలైన రోజే మహేశ్కు బిగ్ షాక్
దాదాపు రెండున్నరేళ్ల తర్వాత ‘సర్కారు వారి పాట' మూవీతో సూపర్ స్టార్ మహేశ్ బాబు బిగ్ స్క్రీన్పై సందడి చేస్తున్నాడు. దీంతో అతడి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఫలితంగా వాళ్లంతా ఈ సినిమా విడుదలను పండుగలా జరుపుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి విడుదలైన రోజే ట్విట్టర్ వేదికగా బిగ్ షాక్ తగిలింది.

ట్విట్టర్లో డిజాస్టర్ ట్యాగ్ ట్రెండ్
సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట' మూవీ ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ నేపథ్యంలో ట్విట్టర్లో DisasterSVP అనే హ్యాష్ ట్యాగ్ విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఇందులో ఈ సినిమా డిజాస్టర్ అయిందని చాలా రకాలుగా ట్రోల్స్ చేస్తూ ట్వీట్లు కనిపిస్తున్నాయి. ఇప్పటికే దీనిపై పది వేలకు పైగా ట్వీట్లు కూడా వచ్చేశాయి.

ఇదంతా ఆ ఫ్యాన్స్ పనే అంటూ
DisasterSVP హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ అవడంతో సూపర్ స్టార్ మహేశ్ బాబు అభిమానులు కూడా ధీటుగానే స్పందిస్తున్నారు. ఇదంతా యాంటీ ఫ్యాన్స్ చేసే పనే అంటూ ఆరోపిస్తున్నారు. అంతేకాదు, సినిమా చాలా బాగుందని.. కావాలనే దీనిపై ప్రతికూల రివ్యూలను షేర్ చేస్తున్నారని అంటున్నారు. దీంతో మహేశ్ బాబు సినిమా మరింతగా ట్రెండ్ అయిపోతోంది.


Click it and Unblock the Notifications











