Don't Miss!
- News ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మాధవన్కు అదిరిపోయే వెల్కం చెప్పిన ‘సవ్యసాచి’
నాగ చైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న చిత్రం 'సవ్యసాచి'. ఈ చిత్రంలో సౌత్ యాక్టర్ మాధవన్ కీలకమైన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇంతకు ముందు మాధవన్ మణిరత్నం 'సఖి', గౌతమ్ మీనన్ 'చెలి' చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. అయితే ఆ చిత్రాలు తమిళంలో తెరకెక్కి తెలుగులో అనువాదమైన చిత్రాలు. మాధవన్ నటిస్తున్న తొలి స్ట్రైట్ మూవీ 'సవ్యసాచి'.
పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించడం ద్వారా మాధవన్ నటుడిగా జాతీయ స్థాయిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాంటి నటుడిని దర్శకుడు చందూ మొండేటి తొలిసారిగా టాలీవుడ్లోకి తీసుకొచ్చారు. టాలీవుడ్లోకి మాధవన్ ఎంట్రీ ఇస్తున్న సందర్భంగా అతడికి వార్మ్ వెల్ కం చెబుతూ చిత్ర బృందం ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా... ఈ చిత్రానికి సంబంధించి మాధవన్ షూటింగ్ ఇటీవలే పూర్తయింది.
"తన రెండు చేతులను సమర్ధవంతంగా వినియోగించగల అర్జునుడిని "సవ్యసాచి" అంటారు. నాగచైతన్య సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో మాధవన్, భూమికలు ప్రత్యేక పాత్రలు పోషిస్తున్నారు.
కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించడంతోపాటు నేపధ్య సంగీతం సమకూరుస్తున్నారు. జూన్ 14న సవ్యసాచిని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. నాగచైతన్య, నిధి అగర్వాల్, ఆర్.మాధవన్, భూమిక చావ్లా, రావు రమేష్, వెన్నెల కిశోర్, సత్య, తాగుబోతు రమేష్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎం.కీరవాణి, సినిమాటోగ్రఫీ: యువరాజ్, కళ: రామకృష్ణ, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఫైట్స్: రామ్ - లక్ష్మణ్, కో-డైరెక్టర్: చలసాని రామారావు, సి.ఈ.ఓ: చిరంజీవి(చెర్రీ), లైన్ ప్రొడ్యూసర్: పి.టి.గిరిధర్, నిర్మాతలు: వై.నవీన్, వై.రవిశంకర్, మోహన్ (సివిఎం), కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: చందు మొండేటి.