Don't Miss!
- News Chengicherla: రాజా సింగ్ హౌస్ అరెస్ట్, బండి సంజయ్పై కేసు నమోదు
- Sports RR vs DC: చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్.. ఒకే ఒక్కడిగా..!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
అక్కినేని అఖిల్ లాంచింగ్ గురించి శేఖర్ కమ్ముల
ఇక తాను స్టార్స్ తో చేయకపోవటానికి కారణం వివరిస్తూ..."స్టార్స్తో సినిమా చేయకూడదని నేనెప్పుడూ అనుకోలేదు. నా కథ కొత్తవారిని డిమాండ్ చేస్తే కొత్తవారితో పనిచేస్తా. స్టార్స్ కావాలంటే వారిదగ్గరకు వెళ్తాను. అలాగే నా కథలు చాలా వరకు తెలుగుదనంతో నిండి ఉంటాయి. హ్యాపీడేస్ను తమిళ్లో తీశారు. అక్కడ పెద్దగా ఆడలేదు. కారణం నా సినిమాలు మన వాతావరణానికి చాలా దగ్గరగా ఉంటాయి. తెలుగుతనం అనే సూత్రంతో అల్లుకుని ఉంటాయి. నేనెప్పుడు సినిమా చేసినా మధ్యతరగతి కుర్రాళ్ళనే ధ్యేయంగా పెట్టుకుంటాను. నా టార్గెట్ ఆడియన్స్ వారే. అలాగే సింపుల్గానే సినిమాలు చేస్తా. సింపుల్ సినిమాలుచేయడం చాలా కష్టం అన్నారు.
ప్రస్తుతం ప్రేక్షకుల ఆలోచనా ధోరణి చాలా మారిపోయింది. రొటీన్ ఫార్ములా సినిమాలను చూడ్డానికి వాళ్లు అస్సలు ఇష్టపడటంలేదు. మేమంతా డిఫరెంట్గా ఆలోచించాల్సిన అవసరం వచ్చేసింది. ఈ రోజుల్లో మల్టీప్లెక్స్ ప్రేక్షకులను గెలుచుకోకపోతే కష్టం అన్నారు. ఈ విషయమై వివరణ ఇస్తూ...ఒకప్పుడు సమాజం ప్రశాంతంగా ఉండేది. తెరపై యాక్షన్, డ్రామాను ప్రేక్షకులు విపరీతంగా ఆస్వాదించేవారు. ఇప్పుడు సమాజంలో అన్నీ కనిపిస్తున్నాయి. అందుకే ప్రజలు సింపుల్గా, ప్రశాంతంగా ఉండే నా సినిమాలను ఇష్టపడుతున్నారేమో. నాకూ యాక్షన్ సినిమా తీయాలని ఉంది. కానీ అది కూడా నా మార్కుతో ఉంటుంది. చెడుపై మంచి పోరాడితే అది యాక్షన్ అని నా అభిప్రాయం. అలాగే భవిష్యత్తులో రొడ్డకొట్టుడు మూస చిత్రాలు ప్రజలను మెప్పించలేవు. ఎప్పటికప్పుడు వైవిధ్యతను కనబరుస్తుండాలి. మల్టీప్లెక్స్ మూవీస్దే పైచేయి అవుతుంది అని వివరించారు.
స్వీయదర్శకత్వంలో శేఖర్ నిర్మించిన 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' రేపు (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా గురించి దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ ''మధ్య తరగతి కుటుంబాలు, వారి అనుబంధాల నేపథ్యంలో సాగే కథ ఇది. బతకడమే ఓ అదృష్టం... అందుకే ఒకరికొకరు సాయం చేసుకొందాం అని చెప్పే ప్రయత్నం చేశాం. అమల, శ్రియ, అంజలా జవేరి పోషించిన పాత్రలు కథలో కీలకం. మిక్కీ జె.మేయర్ సంగీతం చిత్రానికి బలాన్నిస్తుంది''అన్నారు.