సినీ 'బ్రహ్మోత్సవం': మహేష్ షూటింట్ లో షారుఖ్ (ఫొటోలు)
హైదరాబాద్: మహేశ్బాబు, సమంత, ప్రణీతలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'బ్రహ్మోత్సవం'. ఈ చిత్రం షూటింగ్ వినాయక చవితి సందర్భంగా రామోజీ ఫిలిం సిటీలో ప్రారంభమైన విషయం తెలిసిందే.
అదే సమయంలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ తన దిల్వాలే చిత్రం షూటింగ్ కోసం రామోజీ ఫిలిం సిటీలో గత కొన్ని రోజులుగా పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో శనివారం షారుఖ్ మహేశ్బాబు సెట్ చూసేందుకు వచ్చారు.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
ఈ సందర్భంగా మహేశ్బాబు, షారుఖ్లు సరదాగా కాసేపు మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా మహేశ్ భార్య నమ్రత కూడా ఉన్నారు. ఈ విషయమై మహేష్, షారూఖ్ లు చేసిన ట్వీట్ లు...
స్లైడ్ షోలో ..షారూఖ్ ,మహేష్ కలిసినప్పటి ఫొటోలు

సెట్లో షారుఖ్ ..ఆశ్చర్యం
మహేష్బాబు సినిమా సెట్లో బాలీవుడ్ బాద్షా షారుఖ్ఖాన్ ప్రత్యక్షమయ్యాడు. వూహించని రీతిలో షారుఖ్ సెట్లో కనిపించేసరికి అంతా ఆశ్చర్యపోయారు.

ఫిల్మ్ సిటీలో...
మహేష్బాబు హీరోగానటిస్తున్న 'బ్రహ్మోత్సవం' ప్రస్తుతం రామోజీ ఫిల్మ్సిటీలో చిత్రీకరణ జరుపుకొంటోంది. షారుఖ్ఖాన్ కథానాయకుడిగా నటిస్తున్న 'దిల్వాలే' చిత్రీకరణ కూడా అక్కడే జరుగుతోంది.

విరామంలో
షూటింగ్ విరామంలో షారుఖ్ఖాన్ 'బ్రహ్మోత్సవం' సెట్లోకి వెళ్లి అక్కడున్న వారిని పలకరించాడు. అక్కడే ఉన్న మహేష్బాబు షారుఖ్ని సాదరంగా ఆహ్వానించారు.

కృతి సనన్ కూడా
మహేష్ భార్య నమ్రత, కూతురు సితారలతోనూ షారుఖ్ సరదాగా ముచ్చటించారు. మహేష్తో కలిసి '1' (నేనొక్కడినే)లో నటించిన కృతిసనన్ కూడా 'బ్రహ్మోత్సవం' సెట్ని సందర్శించినవారిలో ఉన్నారు. కృతి ప్రస్తుతం 'దిల్వాలే'లో నటిస్తోంది.

వీర్దిద్దరూ
మహేష్, షారూఖ్ ఇద్దరూ పర్శనల్ గా కాస్సేపు మాట్లాడుకున్నారు

ఆహ్వానం
షారూఖ్ వస్తున్నాడని తెలిసి, ఎదురువెళ్లి మహేష్ ఆహ్వానించారు

కబుర్లు
షారూఖ్ ఈ దంపతులతో కాస్సేపు ఫన్ గా కబుర్లు చెప్పారు

సితార
మహేష్ కుమార్తె సితార తన తల్లి చంక ఎక్కింది. షారూఖ్ ఆమెను ముద్దాడారు

షారూఖ్
షారూష్, మహేష్, నమ్రత, వీరితో పాటు మహేష్ కుమార్తె సితార
టీమ్ ట్వీట్
ఈ విషయమై బ్రహ్మోత్సవం టీమ్ ట్వీట్ చేసింది.
నిర్మాత ట్వీట్
ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న పివీపి బ్యానర్ వారు ఇలా ట్వీట్ చేసారు...


Click it and Unblock the Notifications











