Don't Miss!
- News రాహుల్ సహా నేడు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్న కీలక నేతలు వీరే..
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రిలీజైన 18 ఏళ్లకు పెరూ ప్రేక్షకుల కోసం మన చిత్రం
ముంబై: 'దిల్వాలే దుల్హనియా లేజాయింగే'(డీడీఎల్జే) ఈ చిత్రం పేరు వినని సినీ ప్రేమికులు అరుదుగానే ఉంటారు. ఎందుకంటే ఈ చిత్రం సాధించిన రికార్డ్ కలెక్షన్స్ ని బ్రద్దలు కొట్టే చిత్రమేదీ ఇప్పటికి రాలేదు. అలాగే ఈ చిత్రం నుంచి ప్రేరణ పొందిన చిత్రాలు ఇప్పటికి దాదాపు ప్రతీ భాషలోనూ వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ చిత్రం పెరూ లోనూ విడుదల అవుతోంది. ఈ సినిమా రూపుదిద్దుకొని 18 సంవత్సరాల గడిచిన తర్వాత పెరూ ప్రేక్షకులకు కనువిందు చేయబోతోంది.
భాష ఏదైనప్పటికీ ఈ రోజుల్లో ఓ చలన చిత్రం నెల రోజుల పాటు ఆడితే అదే గొప్ప. కానీ ఒక సినిమా గత 18 సంవత్సరాల నుంచి నిర్విరామంగా ప్రదర్శించబడటం మాత్రం చెప్పుకోగ్గ విషయమే. ఈ ఘనతను సొంతం చేసుకున్న చిత్రం 'దిల్వాలే దుల్హనియా లేజాయింగే'(డీడీఎల్జే). షారూఖ్ ఖాన్, కాజోల్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్టయ్యింది. ఈ సినిమాలోని పలు సన్నివేశాలు ఆ తర్వాత రూపుదిద్దుకున్న పలు చిత్రాల్లోనూ చోటు చేసుకున్నాయి.
అంతటి పేరును సంపాదించుకున్న ఈ చిత్రాన్ని త్వరలో పెరూ దేశంలోనూ ప్రదర్శించనున్నారు. 18 సంవత్సరాల క్రితం(1995) విడుదలైన ఈ చిత్రానికి దర్శకుడు ఆదిత్య చోప్రా. దీనికి నిర్మాత ఆయన తండ్రి, ప్రముఖ దర్శకుడు యశ్ చోప్రా. తన మొదటి ప్రయత్నంతోనే ఆదిత్య చోప్రా ప్రేక్షకుల మనసులను ఉర్రూతలూగించారు. ప్రస్తుత ప్రముఖ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహర్ ఒక చిన్న పాత్రలో ఈ చిత్రంలో తళుక్కుమన్నారు. ముంబయిలోని ఒక సినిమా హాలులో ఈ చిత్రం విడుదలైనప్పటి నుంచీ నేటి వరకు ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది.