Don't Miss!
- News ఎల్లుండే వైసీపీలోకి యనమల ? చర్చలు పూర్తి..!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
'ఈగ' ని మెచ్చుకున్న ఆస్కార్ అవార్డు దర్శకుడు
హైదరాబాద్ : ప్రస్తుతం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా ఉన్న దర్శకుడు ఎవరంటే రాజమౌళి అని చెప్పవచ్చు. హిందీలో ఒక్క చిత్రమూ డైరక్ట్ చేయకుండా ఆయన అక్కడ ప్రముఖులందరి ప్రశంసలూ పొందుతున్నారు. తాజా చిత్రం 'ఈగ' హిందీలోకి 'మఖ్ఖీ' పేరున డబ్బింగ్ అయి రిలీజ్ అవుతున్న నేపధ్యంలో అందరూ ఆయనకి కంగ్రాట్స్ ,విషెష్ తెలియచేస్తున్నారు. తాజాగా ఆయన పై ప్రముఖ దర్శకుడు,ఆస్కార్ అవార్డు విజేత శేఖర్ కపూర్ దృష్టి పడింది. ఆయన ఈ చిత్రం చూడబోతున్నానంటూ కంగ్రాట్స్ చెప్తూ రాజమౌళి కి ఫోన్ చేసారు. ఈ విషయం స్వయంగా రాజమౌళి ట్వీట్ ద్వారా తెలియచేసారు.
రాజమౌళి తన ట్వీట్ లో..." నాకు ఈ క్షణాలు చాలా అమూల్యమైనవి. నా ఫేవెరెట్ దర్శకుడు శేఖర్ కపూర్ ఫోన్ చేసి ఈగ గురించి మాట్లాడారు. ఆయన రేపు ఈ చిత్రాన్ని చూడబోతున్నారు. చాలా ఆనందగా ఉంది," అన్నారు. అలాగే రెండు రోజుల క్రితం ఈ చిత్రం ప్రీమియర్ షో చూసి బాలీవుడ్ బాద్షా షారూఖ్ ప్రశంసల్లో ముంచెత్తారు. ఆయన ఈగ గురించి ట్వీట్ చేస్తూ... "మక్కి చిత్రం రాజమౌళి అద్బుతంగా తెరకెక్కించారు. చాలా బాగుంది. అక్టోబర్ 12న విడుదల అవుతున్న ఈ చిత్రం..అందరూ తప్పకుండా చూడాల్సిన సినిమా. రాజమౌళికి,టీమ్ అందరికీ బెస్ట్ ఆఫ్ లక్ " అని అన్నారు.
దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి కూడా గత కొన్ని రోజులుగా ముంబైలో 'మఖ్ఖీ' ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. త్వరలోనే రాజమౌళి ఓ హిందీ సినిమాకి దర్శకత్వం వహిస్తారనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో రాజమౌళి స్పందించారు. ''బాలీవుడ్లో 'ఈగ' ఫలితం ఎలా ఉంటుందా? అని ఆలోచించడం లేదు. ఎందుకంటే ఇప్పటికే... తెలుగు ప్రేక్షకులకు ఈ కథ బాగా నచ్చింది. బాలీవుడ్లో అడుగుపెడితే కొత్త కథతోనే వెళ్లాలి. తెలుగులో నేను రూపొందించిన సినిమాల్ని రీమేక్ చేయాలనే ఆలోచన కూడా లేదు. ఎందుకంటే సినిమా అంటే రెండేళ్ల కష్టం. మళ్లీ అదే కథపై మరో రెండేళ్లు వెచ్చించడం నాకు నచ్చదు. బాలీవుడ్లో సినిమా తీయాలనుకొంటే కొత్త కథే రాసుకొంటా'' అన్నారు.
రిలయన్స్ ఎంటర్ టైనర్ వారు ఈచిత్రాన్ని బాలీవుడ్లో భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. నాని, సమంత, సుదీప్ ప్రధాన పాత్రలు పోషించిన ఈచిత్రంలో రాజమౌళి దర్శకత్వానికి, సుదీప్ నటనకు, కళ్లు చెదిరే గ్రాఫిక్స్కు ప్రేక్షకులు ఫుల్ మార్కులు వేసేశారు. భారతీయ సినీ చరిత్రలోనే గొప్ప చిత్రంగా పేరు తెచ్చుకుంది. ఇక ''నాన్నా.. కథ చెప్పవూ..'' అనే సంభాషణతో సినిమా మొదలవుతుంది. ఆ నాన్న గొంతు దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళిదే. అక్కడ కూడా ప్రారంభ సన్నివేశంలో తండ్రీ కూతుళ్ల సంభాషణ వినిపిస్తుంది. అయితే ఈసారి కథను బాలీవుడ్ హీరో అజయ్దేవగణ్తో చెప్పించారు.