Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
రేపటి వరకు షూటింగులు రద్దు
దర్శక రత్న దాసరి నారాయణ రావు భార్య, సినీ నిర్మాత దాసరి పద్మ(65) శుక్రవారం మరణించారు. గత కొంత కాలంగా ఊపిరి తిత్తుల వ్యాధితో బాధ పడతున్న ఆమె యశోధ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు తుది శ్వాస విడిచారు. పద్మ మరణంతో సినీ వర్గాల్లో విషాదం నెలకొంది. ఆమె మృతికి సంతాపంగా శనివారం మధ్యాహ్నం వరకు షూటింగులు రద్దు చేస్తున్నట్లు తెలుగు సినీ సమాఖ్య ప్రకటించింది.
పద్మ మరణం తెలియడంతో సీఎం కిరణ్ దాసరి ఇంటికి చేరుకుని ఆయన్ను ఓదార్చారు. మంత్రులు దానం నాగేందర్, ఏరాసు ప్రతాపరెడ్డి, మోహన్ బాబు, కృష్ణ దంపతులు, జయసుధ, రోజా, కవిత, కళ్యాణ్ రామ్, అశ్వినీ దత్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు దాసరి నివాసానికి చేరుకుని పద్మ మృతదేహానికి నివాళులర్పించారు.
దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన శివరంజని, మేఘ సందేశం, ఒసేయ్ రాములమ్మ, మజ్ను, ఒరేయ్ రిక్షా సినిమాలకు పద్మ నిర్మాతగా వ్యవహరించారు. అంతే కాకుండా తమిళనాడు మహిళా కాంగ్రెస్ కార్యదర్శిగా పని చేశారు.