Don't Miss!
- News పొలిటికల్ పంచ్, ఓటు కోసం మాట మార్చిన సీఎం, కాలేజ్ అమ్మాయి కేసు కోసం స్పెషల్ కోర్టు!
- Sports CSK vs LSG: అందుకే రచిన్ రవీంద్రను పక్కనపెట్టాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
శ్రేయా ఘోషల్ గ్రేట్.. మేడమ్ టాస్సాడ్ మ్యూజియంలో..
ప్రతిభావంతురాలైన గాయనిగా ఇప్పటికే పేరు తెచ్చుకొన్న శ్రేయా ఘోషల్కు మరో అరుదైన గౌరవ దక్కింది. ఆమె మైనపు విగ్రహాన్ని ఢిల్లీలోని మేడమ్ టస్సాడ్స్ మ్యూజియంలో ప్రతిష్టించనున్నారు.
ఈతరం జనరేషన్లో అద్భుతమైన గాయనీ, గాయకుల్లో శ్రేయ ఘోషల్ ఒకరు. ప్రతిభావంతురాలైన గాయనిగా ఇప్పటికే పేరు తెచ్చుకొన్న శ్రేయా ఘోషల్కు మరో అరుదైన గౌరవ దక్కింది. ఆమె మైనపు విగ్రహాన్ని ఢిల్లీలోని మేడమ్ టస్సాడ్స్ మ్యూజియంలో ప్రతిష్టించనున్నారు.
మోదీ, అమితాబ్ సరసన..
ఢిల్లీలో మేడమ్ టస్సాడ్ మ్యూజియాన్ని గత జూన్లో ప్రారంభించారు. ప్రపంచంలో టాస్సాడ్ మ్యూజియంలో ఇది 23వది. ఈ మ్యూజియంలో ఇప్పటికే ప్రముఖులకు స్థానం దక్కింది. తాజాగా ఈ జాబితాలో శ్రేయా ఘోషల్ చేరింది. ఆమె విగ్రహాన్ని బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్, ప్రధాని నరేంద్రమోదీ, పాస్ సింగర్ లేడీ గగా విగ్రహల పక్కనే ఏర్పాటు చేయనున్నారు.
థ్రిల్లింగ్గా ఉంది..
మేడమ్ టస్సాడ్స్ మ్యూజియంలో నా విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారనే వార్తతో చాలా థ్రిల్గా ఫీలయ్యాను. ఎందరో గొప్ప కళాకారులు, మహానుభావుల సరసన చేరడం చాలా గర్వంగా ఉంది. అద్భుతమైన ఫీలింగ్కు గురవుతున్నాను అని శ్రేయా వెల్లడించింది.
ఢిల్లీలోని టస్సాడ్ మ్యూజియం
జూన్ నుంచి మైనపు విగ్రహాల మ్యూజియంను సందర్శించేందుకు ప్రజలకు అవకాశం కల్పించారు. వివిధ రంగాలకు చెందిన 50 మంది ప్రముఖుల విగ్రహాలను ఏర్పాటు చేశారు. మార్చి 12 పుట్టిన రోజు జరుపుకొన్న శ్రేయా విగ్రహం కూడా త్వరలో ఈ మ్యూజియంలో ఏర్పాటుకానున్నది.
ఆకర్షణీయమైన వ్యక్తి శ్రేయా
సంగీత ప్రపంచంలో అత్యున్నత ప్రతిభ చూపుతున్న గాయని శ్రేయా ఘోషల్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నామని తెలుపడానికి సంతోషిస్తున్నాం. ప్రస్తుత యువతరం కళాకారుల్లో శ్రేయా అత్యంత ఆకర్షణీయమైన వ్యక్తి. ఆమె విగ్రహం అభిమానులను కచ్చితంగా ఆకట్టుకొంటుందనే అభిప్రాయాన్ని మ్యూజియం జీఎం అనుషల్ జైన్ తెలిపారు.