Don't Miss!
- News వైసీపీలోకి జనసేన కోనసీమ కీలక నేత..!!
- Technology Motorola నుంచి రెండు కొత్త ఇయర్ బడ్స్ లాంచ్! ధర, ఫీచర్లు
- Sports వరల్డ్ కప్కు దూబె ఎంపికైనట్లే.. కానీ ఓ సమస్య- డివిలియర్స్
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
మాస్ హీరోను పట్టేసిన శృతిహాసన్.. ఇకనైనా ఆయనకు సక్సెస్ దక్కేనా!
కాటమరాయుడు తర్వాత అటు తెలుగులో గానీ, తమిళంలో గానీ సినిమాలు అంగీకరించకపోవడంతో శృతిహాసన్ పెళ్లి చేసుకోబోతున్నారంటూ మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి. లండన్ ప్రియుడు కోర్సలేతో అతిసన్నిహితంగా ఉంటూ అతడితో అప్పట్లో చెన్నైలో ఓ పెళ్లికి హాజరవ్వడం చర్చనీయాంశమైంది. అయితే తాజాగా ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ తదుపరి చిత్రం అమర్ అక్బర్ ఆంథోని చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.
కాటమరాయుడు చిత్రంలో
మార్చి 2017లో రిలీజైన కాటమరాయుడు చిత్రంలో చివరిసారిగా శృతిహాసన్ కనిపించింది. దర్శకుడు సుందర్ సీ ప్రతిష్టాత్మకంగా రూపొందించే సంఘమిత్రలో టైటిల్ రోల్ పాత్ర పోషించేందుకు సిద్ధమైంది. అయితే కొన్ని కారణాల వల్ల ఆ చిత్రం నుంచి శృతి తప్పుకోవడం వివాదంగా మారింది.
అమర్ అక్బర్ అంథోనిలో రవితేజతో
ఆ తర్వాత మైఖేల్ కోర్సలేతో అడపాదడపా కనిపిస్తూ వార్తల్లో నిలిచిన శృతిహాసన్ ఇక సినిమాలకు గుడ్ బై చెప్పనున్నారనే నేపథ్యంలో అమర్ అక్బర్ అంథోనిలో రవితేజ్తో కలిసి నటించేందుకు అంగీకరించారు. గతంలో వీరిద్దరూ నటించిన బలుపు చిత్రం మంచి విజయాన్ని చేజిక్కించుకొన్న సంగతి తెలిసిందే.
దర్శకుడిగా శ్రీను వైట్ల
వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న శ్రీను వైట్ల దర్శకత్వంలో అమర్ అక్బర్ ఆంథోని రూపొందనున్నది. గతంలో శ్రీనువైట్ల రూపొందించిన ఆగడు చిత్రంలో ఓ స్పెషల్ పాత్రలో మెరిసింది. మరోసారి శ్రీనువైట్లతో జతకట్టడం ఆసక్తికరంగా మారింది.
మహేష్ మంజేక్రర్
అంతేకాకుండా ఓ బాలీవుడ్ చిత్రంలో నటించేందుకు కూడా శృతిహాసన్ ఒప్పుకొన్నారు. ఈ చిత్రానికి ప్రముఖ నటుడు, దర్శకుడు మహేష్ మంజ్రేకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో యువ నటుడు విద్యుత్ జమ్వాల్ హీరోగా నటిస్తున్నారు.