Don't Miss!
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- News దేవినేని ఉమకు కీలక బాధ్యత అప్పగించిన చంద్రబాబు..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Sports ఖమ్మం క్లాసెన్..మెదక్ మార్క్రమ్: క్రియేటివిటీ కొట్టేవాడే లేడు భయ్యా
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
శ్రుతిహాసన్ వి ఒకే రోజు రెండు
ఈ విషయమై శృతిహాసన్ మాట్లాడుతూ... ''నేను బాలీవుడ్లో తాజాగా నటించిన 'డి-డే', 'రామయ్యా వస్తావయ్యా' సినిమాలు ఒకే రోజున విడుదల కాబోతున్నాయి. జులై 19న ఈ రెండు చిత్రాల్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. అందుకే ఆ రోజు కోసం నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను'' అంది. 'రామయ్యా వస్తావయ్యా' చిత్రం అయితే తెలుగులో సూపర్ హిట్టైన నువ్వు వస్తానంటే..నే వద్దంటానా రీమేక్. ప్రభుదేవా దర్శకత్వంలో రూపొందుతున్న ఆ చిత్రంపైనా మంచి అంచనాలే ఉన్నాయి.
నిఖిల్ అద్వానీ దర్శకత్వంలో రూపొందిన 'డి-డే'లో శృతి హాసన్ వేశ్య పాత్రను పోషించింది. అర్జున్ రామ్పాల్ - శ్రుతిల మధ్య ఘాటైన సన్నివేశాలున్నాయని సమాచారం. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఇప్పటికే హాట్ టాపిక్ గా మారి సినిమాకు బోల్డ్ క్రేజ్ తెచ్చిపెట్టింది.
'డి-డే' గురించి శ్రుతి మాట్లాడుతూ ''కథ ప్రకారం చిత్రానికి ఏ సన్నివేశాలు అవసరమో వాటిలో కనిపించాను. నా పాత్ర సవాలుతో కూడుకొన్నది. అందుకే దర్శకుడు కథ వినిపించినపుడు ఎలాంటి ఆలోచన చేయకుండా నటించేందుకు అంగీకరించాను'' అని తెలిపింది. ఇక శృతిహాసన్ నటించిన బలుపు ఈ వారమే విడుదల కానుంది. ఎన్టీఆర్ సరసన ఆమె 'రామయ్యా వస్తావయ్యా' చిత్రం చేస్తోంది.