శ్రుతిహాసన్ వి ఒకే రోజు రెండు
ఈ విషయమై శృతిహాసన్ మాట్లాడుతూ... ''నేను బాలీవుడ్లో తాజాగా నటించిన 'డి-డే', 'రామయ్యా వస్తావయ్యా' సినిమాలు ఒకే రోజున విడుదల కాబోతున్నాయి. జులై 19న ఈ రెండు చిత్రాల్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. అందుకే ఆ రోజు కోసం నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను'' అంది. 'రామయ్యా వస్తావయ్యా' చిత్రం అయితే తెలుగులో సూపర్ హిట్టైన నువ్వు వస్తానంటే..నే వద్దంటానా రీమేక్. ప్రభుదేవా దర్శకత్వంలో రూపొందుతున్న ఆ చిత్రంపైనా మంచి అంచనాలే ఉన్నాయి.
నిఖిల్ అద్వానీ దర్శకత్వంలో రూపొందిన 'డి-డే'లో శృతి హాసన్ వేశ్య పాత్రను పోషించింది. అర్జున్ రామ్పాల్ - శ్రుతిల మధ్య ఘాటైన సన్నివేశాలున్నాయని సమాచారం. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఇప్పటికే హాట్ టాపిక్ గా మారి సినిమాకు బోల్డ్ క్రేజ్ తెచ్చిపెట్టింది.
'డి-డే' గురించి శ్రుతి మాట్లాడుతూ ''కథ ప్రకారం చిత్రానికి ఏ సన్నివేశాలు అవసరమో వాటిలో కనిపించాను. నా పాత్ర సవాలుతో కూడుకొన్నది. అందుకే దర్శకుడు కథ వినిపించినపుడు ఎలాంటి ఆలోచన చేయకుండా నటించేందుకు అంగీకరించాను'' అని తెలిపింది. ఇక శృతిహాసన్ నటించిన బలుపు ఈ వారమే విడుదల కానుంది. ఎన్టీఆర్ సరసన ఆమె 'రామయ్యా వస్తావయ్యా' చిత్రం చేస్తోంది.


Click it and Unblock the Notifications












