Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
హాట్ న్యూస్: రామ్ సరసన శృతి హాసన్ ఖరారు
హైదరాబాద్: శృతి హాసన్ మరో చిత్రం కమిటైంది. గబ్బర్ సింగ్ హిట్టవటంతో విజయోత్సాహంలో ఉన్న శృతి ఈ సారి రామ్ సరసన చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ చిత్రం మరేదో కాదు బెల్లంకొండ సురేష్ ఆ మధ్యన ప్రారంభించి ఆపేసిన కందిరిగ చిత్రం సీక్వెల్. సాయిగణేష్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్పై, మల్టీ డైమన్షన్ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో ఈ చిత్రం రూపొందనుంది. ఐదు నెలల క్రితం ఈ చిత్రం ప్రారంభమై ఆగిపోయింది. ప్రస్తుతం శృతి హాసన్... రవితేజ సరసన బలుపు చిత్రం చేస్తోంది.
అప్పట్లో కందిరీగ దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ పై బెల్లంకొండ సురేష్ చేయి చేసుకున్నాడంటూ చేసిన ఫిర్యాదు అంతటా చర్చనీయాంశమైంది. ఈ మేరకు దర్శకుడు ఎపీ ఫిల్మ్ డైరక్టర్స్ అసోశియేషన్ లో కంప్లైంట్ చేసారు. రామ్ హీరోగా రూపొందించిన కందిరీగ తో సంతోష్ శ్రీనివాస్ దర్శకుడు అయ్యారు. ముందుగా చేసుకున్న ఎగ్రిమెంట్ ప్రకారం ప్రస్తుతం రామ్ హీరోగా మరో చిత్రాన్ని శ్రీనివాస్ తెరకిక్కించే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుంది.
బెల్లంకొండ సురేష్ కి, సంతోష్ శ్రీనివాస్ కి మధ్య వివాదం రెమ్యునేషన్ విషయంలో తలెత్తిందని, రెమ్యునేషన్ విషయంలో మాట మాట రావటంతో కోపగించిన బెల్లంకొండ సురేష్.. వెంటనే ఆవేశంలో శ్రీనివాస్ ని కొట్టాడని చెబుతున్నారు. దర్శకుడుగా సంతోష్ శ్రీనివాస్ కి లైఫ్ ఇచ్చిన బెల్లంకొండకు రెమ్యునేషన్ విషయంలో శ్రీనివాస్ పట్టుబట్టడంతో పట్టరాని కోపం వచ్చే చెయ్య జారాడని చెప్పుకున్నారు. అయితే ఇప్పుడా వివాదం పూర్తిగా సెటిలయ్యి... సినిమా మళ్లీ పట్టాలు ఎక్కడం మంచి పరిణామమే.
ఇక రామ్ ప్రస్తుతం హీరోగా భోగవల్లి బాపినీడు సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా లిమిటెడ్ పతాకంపై బొమ్మరిల్లు బాస్కర్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. భారీ చిత్రాల నిర్మాత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం టైటిల్ 'ఒంగోలు గిత్త'. ఈ చిత్రం షూటింగు నాన్ స్టాప్ గా జరుగుతోంది. అయితే ఈ చిత్రానికి తుఫాన్ దెబ్బ కొట్టింది. ఈ చిత్రం కోసం వేసిన సెట్ పూర్తిగా తడిసి ఆగిపోయి మళ్లీ మొదలైంది.