Don't Miss!
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Lifestyle హడలెత్తిస్తున్నBird Flu పాలు, గుడ్లు మరియు చికెన్ తినడం సురక్షితమేనా?మనుషులకూ వ్యాపిస్తుందా..నిపుణులు ఏమంటారు?
- News గెలిస్తే వాషింగ్టన్ డీసీ చేస్తా అన్నావ్.. రాజధానే లేకుండా చేశావ్ జగనన్నా.. షర్మిల చురకలు
- Sports సారీ బ్రదర్.. కావాలని కొట్టలేదు - పంత్ ఎమోషనల్ Video
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సిద్దార్ధ, శృతి హాసన్ లో ఫాంటసీ చిత్రం కథ ఇదే...
అంగరాజ్యంలో కన్నీటు బొట్టు ఆకారంలో ఉండే ఓ కాల్పనిక గ్రామంలో ఈ జానపద కథ జరుగుతుంది. క్షుద్రశక్తులతో అంగరాజ్యాన్ని నాశనం చేయాలని రాక్షస మహారాణి అనుకుంటుంది. ఆమె బారిన పడిన తొమ్మిదేళ్ళ పాపను కాపాడటానికి ఒక వీరుడు బయలుదేరతాడు. అతడి ప్రేయసి జిప్పీ వనిత. ఆఖరి పోరాటంలో విజయం ఎవరిని వరించిందన్న దిశలో కథనం నడుస్తుంది. సిద్ధార్థ్, శ్రుతి హాసన్ జంటగా ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది.
కె.రాఘవేంద్రరావు సమర్పణలో వాల్ట్ డిస్నీ (ఇండియా) సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అలాగే ఈ చిత్రంలో మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి ప్రసన్న ఒక రాక్షస మహారాణి పాత్రలో నటిస్తోంది. 2009లో ఈ భారీ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. 2011 జనవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఇప్పటికే భీమిలి, విశాఖ, రామోజీ ఫిలింసిటీలలో జరిగిన షెడ్యూళ్లలో భారీ సెట్స్లో షూటింగ్ జరిపారు. ఈ విషయాలను దర్శక, నిర్మాతలు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరించారు.
దర్శకుడు ప్రకాశరావు మాట్లాడుతూ "నా ఊహల్లో వింత ప్రపంచం కనిపించినప్పటి అనుభూతి వర్ణించలేనిది. భీమిలి, విశాఖ పరిసరాలు, రామోజీ ఫిల్మ్సిటీలో కీలక సన్నివేశాలను తెరకెక్కించాం. వాల్ట్ డిస్నీ సంస్థ ఇప్పటిదాకా పలు విలక్షణమైన కథలకు తెరరూపమిచ్చింది. మా చిత్రం వాటన్నింటినీ మించేలా ఉంటుందన్నారు. ఇక ఈ ప్రాజెక్ట్ కోసం వాల్ట్ డిస్నీ సంస్థతో కలసి పనిచేయడం నాకెంతో గర్వకారణం. ఈ భారీ చిత్ర నిర్మాణానికి వాల్ట్ డిస్నీ సంస్థను మించిన మరో పార్ట్నర్ ఉండరనేది నా నమ్మకం' అన్నారు.