Don't Miss!
- News TTD: శ్రీవారి దర్శనం , సేవలు, వసతి గదుల కోటా విడుదల...!!
- Sports వరల్డ్ కప్కు దూబె ఎంపికైనట్లే.. కానీ ఓ సమస్య- డివిలియర్స్
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
గుంటూరులో సింహా’ గర్జన మారు మ్రోగుతోంది!
బోయపాటి శ్రీను దర్శకత్వంలో పరుచూరి కిరీటి నిర్మాణంలో యూనైటెడ్ మూవీ బ్యానర్ లో రూపొందిన బాలకృష్ణ తాజా చిత్రం 'సింహా" లో హింస ఎక్కువైందని, అతి అవధులు దాటిందనీ..సింహా చూసిన ప్రేక్షకులు వారి వారి అభిప్రాయాలు, విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే 'సింహా" జోరుని అవేమీ అడ్డుకోలేకపోతున్నాయి. నాలుగు రోజులుగా బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట సాగిస్తోన్న 'సింహా" ప్రత్యేకించి గుంటూరులో పంజా దెబ్బ చూపిస్తోంది. ఇప్పటికే తొలి రోజు రికార్డుని హస్తగగం చేసుకున్న 'సింహా" ఇప్పుడు ఆల్ టైమ్ రికార్డు మీద కన్నేసింది.
గుంటూరు జిల్లాకి నాలుగు కోట్లు వసూలు చేసి కనీవినీ ఎరుగని రికార్డుని 'మగధీర" నెలకొల్పితే..'సింహా" ఆ దిశగా దూసుకుపోతోంది. విడుదలైన నాలుగురోజలకే ఇంతటి రెస్పాన్స్ ఎప్పుడూ చూడలేదని పలువురు వ్యక్తం చేస్తున్నరు. అనధికార సమాచారం ప్రకారం 'సింహా" ని నాలుగు కోట్లకి అవుట్ రైట్ కొనడానికి కొందరు ఉత్సాహం చూపుతున్నారని తెలుస్తోంది. అంటే లాంగ్ రన్ లో 'సింహా" నాలుగు కోట్లకు మించి వసూలు చేస్తుందనే అంచనాలు గుంటూరు డిస్ట్రిబ్యూటర్లలో ఉన్నట్టేనని తేలింది. కేవలం కోటి నలభై లక్షల రూపాయలకు గుంటూరు జిల్లా రైట్స్ ని సొంతం చేసుకున్న పంపిణీదారుడు అనూహ్యమైన ఈ స్పందనతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు.