twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామ్ చరణ్ ది 'త్రీ'కథేనా?(స్పెషల్)

    By Staff
    |

    Ram Charan Teja
    'ఎ ఫిల్మ్ బై అరవింద్' సినిమాతో పాపులర్ అయిన శేఖర్ సూరి 'త్రీ' సినిమా ఈ రోజు అంతటా రిలీజ్ అవుతోంది. అయితే ఈ సినిమాకీ రాజమౌళి,రామ్ చరణ్ కాంబినేషన్ లో రెడీ అవుతున్న సినిమా కథకీ చాలా పోలికలు ఉన్నాయని విశ్వసనీయంగా తెలుస్తోంది. ముఖ్యంగా ఈ రెండు సినిమాలు పునర్జన్మ అనే కాన్సెప్ట్ తో తయారయినవే కావటం విశేషం. అంతే గాక గత జన్మలో విడిపోయిన ప్రేమికలు కలవటం మెయిన్ ప్లాట్ అని సమాచారం. అలాగే గత కాలంలో విడతీసిన వ్యక్తే ఈ కాలంలో వారిని కలపటానికి కృషి చేయటం అనే మరో విచిత్రమైన ట్విస్ట్ ఈ రెండు సినిమాల్లో ఉందంటున్నారు.

    లాస్ట్ దీపావళికి షారూఖ్ ఖాన్ హీరోగా వచ్చిన 'ఓం శాంతి ఓం' ని గుర్తు చేసే ఈ రెండు సినిమా కథల్లో ప్రేమికులు అయిన హీరో,హీరోయిన్స్ కి గత జన్మలో ఓ వ్యక్తి వల్ల దారుణం జరిగి విడిపోతారు. ఈ జన్మలో దానికి సంభందించిన ఆనవాళ్ళు దొరికి వాళ్లు మళ్ళీ కలవటం జరుగుతుంది. అంతేగాక ప్లాష్ బ్యాక్ లోనీ ప్రతీ క్యారెక్టర్ ఒక్కరు కూడా మిస్సవకుండా మళ్ళీ పుట్టి అంతా కలుసుకుని అప్పుడు జరిగిన సంఘటనలకు ఇప్పుడు రియాక్షన్స్ ఇస్తూంటారు. అంతేగాక తెరలు తెరలుగా గత జన్మల వాసనలను గుర్తు చేసుకుంటూంటారు.

    ఇక రామ్ చరణ్ సినిమాలో శ్రీహరి పాత్ర ఆ జన్మలో హీరో,హీరోయిన్స్ విడిపోవటానికి కారణమైతే ఈ జన్మలో వారిని కలపటానికి అతను కృషి చేస్తాడని సమాచారం. అలాగే త్రి సినిమాలోనూ గత జన్మలో మెయిన్ లీడ్ విడిపోవటానికి కారణమైన రాజీవ్ కనకాల ఈ జన్మలో వారిని కలపటానికి కృషి చేస్తాడు. అయితే రామ్ చరణ్ సినిమా పక్కా కమర్షియల్ నార్మ్ కి అనుగుణంగా వెళ్తే...త్రీ సినిమాని ధ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో తీసారు. ఈ రోజే త్రి సినిమా రిలీజు అవుతుంది. మరో విషయమేమిటంటే పునర్జన్మ ఆధారంగా వచ్చిన రిషికపూర్ కర్జ్ సినిమా మళ్ళీ హిమ్మేష్ రేష్మియా హీరోగా రూపుదిద్దుకుని ఈ రోజు (శుక్రవారం) రిలీజ్ అవుతోంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X