Don't Miss!
- Finance Jhunjhunwala News: కంపెనీలో 5 లక్షల షేర్లు కొన్న జున్జున్వాలా.. నష్టాల మార్కెట్లోనూ స్టాక్ ర్యాలీ..
- News ప్రచారం పక్కనపెట్టి గర్భిణీకి ప్రసవం.. దర్శి టీడీపీ అభ్యర్థికి హ్యాట్సాఫ్!!
- Lifestyle మామిడికాయ పచ్చడిని ఈజీగా ఇలా తయారు చేసుకోండి..
- Sports అనూహ్య ఘటనను ఎదుర్కొన్న రోహిత్ శర్మ
- Technology OnePlus Flip వన్ప్లస్ ఫ్లిప్ ఫోన్ కీలక వివరాలు లీక్... టెలిఫోటో కెమెరా సహా కీలక ఫీచర్లు..!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
మహేష్ తో చేయాలని ఉందంటూ బాలీవుడ్ స్టార్ హీరోయిన్
హైదరాబాద్ : ' నా డ్రీం టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుతో సినిమా చేయాలన్నది నా కోరిక. అతని లూక్స్ చాలా బాగుంటాయని' తన మనసులో మాటని బయటకి చెప్పేసింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్ మాట్లాడుతూ ఇలా స్పందించింది. గత కొన్ని రోజులుగా మహేష్ బాబు సరసన సోనమ్ కపూర్ నటిస్తోందని వార్తలు వినిపిస్తున్న నేపధ్యంలో ఈ మాటలకు ప్రాధాన్యత ఏర్పడింది. తాజాగా సోనమ్ కూడా తన మసులోని మాట చెప్పడం వల్ల తన కోరిక కూడా త్వరలోనే నిజమవుతుందని ఆశిద్దాం.
సోనమ్ కపూర్ రీసెంట్ గా 'రంఝానా', 'భాగ్ మిల్కా భాగ్' సినిమాలతో సూపర్ హిట్స్ సాథించి ఉషారుగా ఉంది. తాజాగా హైదరాబాద్ లో ఓ ప్రమోషనల్ ఈవెంట్ కి హాజరైన ఈ భామ తనకి టాలీవుడ్ లో పనిచేయాలని ఉందని, తను 'రంఝాన' లో చేసిన లాంటి పూర్తి ప్రాముఖ్యత ఉన్న పాత్రలు వస్తే చేస్తానని తెలిపింది. తనకి తెలుగు పరిశ్రమలో నుంచి చాలా ఆఫర్స్ వస్తున్నాయి కానీ తనకి మన భాష రాకపోవడం వల్లే ఇక్కడి సినిమాలు ఒప్పుకోవడం లేదని తెలిపింది.
మహేష్ బాబు, హిట్ చిత్రాల దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్లో 'దూకుడు' తర్వాత 'ఆగడు' సినిమా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ను హీరోయిన్ గా తీసుకునే యోచనలో ఉన్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. ఈ విషయం ఆ నోట ఈనోట చేరి మీడియాలో సైతం ప్రచారం సాగడంతో సోనమ్ కపూర్ స్పందించింది. నేను మహేష్ బాబుతో చేస్తాననే విషయంలో నిజం లేదు అంటూ తన మైక్రో బ్లాగింగ్ ద్వారా తేల్చి చెప్పింది.
సోనమ్ మహేష్ సినిమా ఆఫర్ ను తిరస్కరించిందనే విషయం ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్ అయింది. అయితే ఇప్పుడు ఆమె ఇలా స్పందించటంతో మళ్లీ మహేష్ ఫ్యాన్స్ లో ఉత్సాహం వచ్చింది. 'ఆగడు' సినిమా వివరాల్లోకి వెళితే...దూకుడు చిత్రాన్ని నిర్మించిన అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నిర్మించనున్నారు. ప్రస్తుతం శ్రీను వైట్ల జూ ఎన్టీఆర్ హీరోగా 'బాద్ షా' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. మరో వైపు మహేష్ బాబు సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ రెండు చిత్రాలు పూర్తయిన తర్వాత మహేష్ బాబు-శ్రీను వైట్ల తాజా చిత్రం సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.