ఇద్దరు హీరోయిన్లతో బ్యాంకాక్ చెక్కేయనున్న ప్రభాస్...!
ఇటీవల 'మిస్టర్ పెర్ ఫెక్ట్', డార్లింగ్ వంటి ఫ్యామిలీ డ్రామా సినిమా చేసిన ప్రభాస్, తాజాగా చేస్తున్న మాస్ సినిమా 'రెబల్'. 'కాంచన" తో హిట్ ఇచ్చిన రాఘవ లారెన్స్ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ చిత్రం తాజా షెడ్యులు షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులో జరుగుతోంది. శ్రీ బాలాజీ సినీ మీడియ పతాకంపై ప్రముక నిర్మాతలు జె భగవాన్, జె పుల్లారావు నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో ప్రధాన తారాగణమంతా పాల్గొనే సన్నివేశాలను ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు. హైదరాబాదు షెడ్యులు పూర్తయ్యాక యూనిట్ బ్యాంకాక్ వెళుతుంది. అక్కడ హీరో హీరోయిన్లు ప్రభాస్, తమన్నాలపై పాటలను చిత్రీకరిస్తారు.
రెబల్ పేరుకు తగ్గట్టుగా మాస్, యాక్షన్ అంశాలతో ప్రభాస్ స్టయిల్లో ఈ చిత్రం రూపొందుతోందని నిర్మాతలు చెబుతున్నారు. దేనికైనా సరే తెగించి పోరాడి విజయం సాధించే యువకుడి కథ ఇదని దర్శకుడు చెప్పాడు. ఆ ప్రయత్నంలో మృత్యువును సైతం ఎదిరిస్తాడని ఆయన అన్నారు. తమన్ దీనికి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. దీక్షా సేథ్ ఇందులో సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది.
ఈ షెడ్యూల్ ఏకధాటిగా చిత్రం పూర్తయ్యేవరకు హైదరాబాద్, బ్యాంకాక్, వైజాగ్ల్లో చేస్తాం. ప్రభాస్లాంటి మంచి హీరోతో మా బ్యానర్ లో ఓ సూపర్ డూపర్ హిట్ సినిమా చేస్తున్నందుకు చాలా ఆనందంగా వుంది. ఈ చిత్ర నిర్మాణంలో ప్రభాస్ అందిస్తున్న కోపరేషన్ని ఎప్పటికీ మరచిపోలేము. అలాగే లారెన్స్ ఏ విషయంలోనూ కాంప్రమైజ్ అవకుండా కంపల్సరీగా సూపర్ డూపర్ హిట్ తీయాలన్న పట్టుదలతో ఈ సినిమా కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఇంత భారీ చిత్రాన్ని నిర్మించడం నిర్మాతలుగా మాకు ఎంతో థ్రిల్ గా వుంది. ప్రభాస్ కెరీర్ లోనే ఇది హై బడ్జెట్ ఫిలిం అవుతుంది. టైటిల్ కి తగినట్లుగా చాలా పవర్ ఫుల్ సబ్జెక్ట్ తో రెబల్ రూపొందుతోంది. తప్పకుండా సూపర్ హిట్ అవుతుందని అంటున్నారు దర్శక నిర్మాతలు..


Click it and Unblock the Notifications











