Don't Miss!
- Sports IPL 2024: ముంబై ఇండియన్స్కు బిగ్ షాక్.. విధ్వంసకర బ్యాటర్ దూరం!
- News Chengicherla: రాజా సింగ్ హౌస్ అరెస్ట్, బండి సంజయ్పై కేసు నమోదు
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
SP Balasubrahmanyam పరిస్థితి విషమం.. వెంటిలేటర్పై చికిత్స
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితి విషమించింది. కొద్ది రోజుల క్రితం కరోనావైరస్ పాజిటివ్ అని తేలడంతో ఆయన చెన్నైలోని ఎంజీఎం హెల్త్ కేర్ ఫర్ సింప్టమ్ ఆఫ్ కోవిడ్ హస్పిటల్లో చేరారు. ఆగస్టు 5వ తేదీ నుంచి ఆయన చికిత్స పొందుతున్నారు. తాజాగా ఆయన ఆరోగ్యం విషమించిందనే విషయంతో అభిమానులు, సినీ ప్రముఖులు ఆందోళనకు గురవుతున్నారు. ఆయన ఆరోగ్యం గురించి హాస్పిటల్ వర్గాలు విడుదల చేసిన బులెటిన్లో ఏమున్నదంటే...
Recommended Video
హాస్పిటల్ వర్గాల సమాచారం ప్రకారం..
చెన్నైలోని హెల్త్ కేర్ ఫర్ సింప్టమ్ ఆఫ్ కోవిడ్ హస్పిటల్ రిలీజ్ చేసిన ప్రకారం.. ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆగస్టు 5వ తేదీన కోవిడ్ 19 పాజిటివ్తో హాస్పిటల్లో చేరారు. అప్పటి నుంచి ఆయనకు చికిత్స అందిస్తున్నాం. రెండు రోజులుగా చికిత్స సరిగానే స్పందించారు. ఆయనకు సడెన్గా శ్వాస సంబంధింత సమస్యలు తలెత్తడంతో ఆరోగ్యం క్షీణించింది అని వైద్యులు వెల్లడించారు.
గురువారం రాత్రి నుంచి పరిస్థితి విషమం
ఆగస్టు 13 తేది (గురువారం) అర్ధరాత్రి నుంచి ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. హస్పిటల్ మెడికల్ టీమ్ నిపుణుల బృందం సలహా, సూచనల మేరకు ఆయనను ఇంటెన్సివ్ కేర్ యూనిట్కు తరలించాం. వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందిస్తున్నాం అని తెలిపారు.
ఐసీయూలో నిరంతర పర్యవేక్షణ
అయితే ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. ఐసీయూలో హేమోడైనమిక్ అండ్ క్లినికల్ పారామీటర్స్ బృందం నిరంతరం ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకొంటూ ఆయన ఆరోగ్యాన్ని మెరుగుపరిచే చర్యలు చేపట్టారు అని విడుదల చేసిన తాజా బులెటిన్లో హాస్పిటల్ వర్గాలు పేర్కొన్నారు.
పలు భాషల్లో వేలాది పాటలు
ఎస్పీ బాలసుబ్రమణ్యం 1966లో శ్రీ శ్రీ మర్యాద రామన్న చిత్రం ద్వారా గాయకుడిగా పరిచయం అయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 5 దశాబ్దాలపాటు పలు భాషల్లో వేలాది పాటలు పాడారు. తెలుగు బుల్లితెరపై పలు సంగీత నేపథ్యం ఉన్న షోలకు ఆయన హోస్ట్గా కూడా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి గొప్ప గాయకుడు త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు ప్రార్థిస్తున్నారు.