twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మా నాన్న చనిపోతూ...: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం

    By Srikanya
    |

    హైదరాబాద్: మా నాన్న చనిపోతూ.. అమ్మ జాగ్రత్త, పిల్లలు జాగ్రత్త అని నామీద ఎంతో నమ్మకంతో అన్న మాటలు ఇంకా గుర్తున్నాయి అంటున్నారు ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. తనికెళ్ల భరణి దర్శకత్వం వహించిన తెలుగు చిత్రం 'మిథునం'లో ఆయన ప్రధాన పాత్ర పోషించారు. ఆ చిత్రం ప్రమోషన్ లో భాగంగా కలిసిన మీడియాతో ఆయన మాట్లాడుతూ ఇలా స్పందించారు. అలాగే.. మా అమ్మా నాన్న గొడవపడటం గుర్తుంది. వాళ్లిద్దరూ పిల్లలందర్నీ అక్కున చేర్చుకుని ఆనందపడిన సంగతులు గుర్తున్నాయి. ఒకసారి దీపావళి నాడు చేతిలో పది రూపాయలు లేనప్పుడు నాకు టపాకాయలు, సిల్కు చొక్కా కావాలని నేను యాగీ చేసిన సంఘటన బాగా గుర్తుంది అన్నారు.

    ప్రముఖ రచయిత, నటుడు తణికెళ్ల భరిణి 'మిథునం'అనే ఓ ఫీచర్ ఫిల్మ్ ని డైరక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మి ప్రధాన పాత్రలుగా రూపొందిన ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. శ్రీరమణ 'మిథునం' కథ ఆధారంగా రూపొందించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తైంది. రీసెంట్ గా విడుదల అయిన ఈ చిత్రం పాటలు అందరినీ అలరిస్తున్నాయి. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది.

    ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ''మిథునం' కథను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన శ్రీరమణ గారికి అభినందనలు. తనికెళ్ల భరణి నాకు తెలిసిన వాడైనందుకు చాలా గర్వపడుతున్నాను. 'మిథునం' అచ్చమైన తెలుగు సినిమా. ఇలాంటి సినిమాలు రావాలి... అందరూ ఆదరించాలి. ఈ రోజుల్లో ఒక మంచి సినిమా బైటికి రావాలంటే పురిటి నొప్పులు పడుతోంది. 'మిథునం' లాంటి మంచి సినిమాలకు ప్రభుత్వ పెద్దలు సహకరించాలి. ఓ మామూలు ఇంటిలో ఈ సినిమా చిత్రీకరణ జరిగింది. ఆ ఇంటిని ఈ చిత్రానికి గుర్తుగా ఉంచేస్తానని నిర్మాత చెప్పడం అభినందనీయం' అన్నారు.

    'మిథునం' చిత్రం వృద్ధ జంట చుట్టూ తిరుగుతుంది. వీరి ప్రేమాభిమానాలు ప్రధానాంశంగా జీవన వేదాతం ఇమిడి కథ నడుస్తుంది. ఇదే కథలో గతంలో మళయాళంలో ఓ చిత్రం నిర్మించారు. కానీ అది పెద్దగా ప్రేక్షకాదరణ నోచుకోలేదు. అయితే భరిణిగారు ఈ కథని ఇప్పటి తరానికి అర్దమయ్యేటట్లుగా స్క్రీన్ ప్లే సమకూర్చుకుని,అందరూ చూసేటట్లుగా రూపొందించానని చెప్తున్నారు. రీసెంట్ గా ఈ చిత్రం మీడియా వారికి ప్రదర్శించారు. అందరూ ఈ చిత్రం బావుందని ప్రదర్శించారు.

    English summary
    Popular Singer SP Bala Subramanyam and Lakshmi played lead roles in "Mithunam". Tanikella Bharani directed this film. Most part of the film shot in a village named Vavilavalasa in Srikakulam district. Sri Ramana has provided the script and Veena Pani is scoring the music for this film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X