Don't Miss!
- News తెలంగాణలో వచ్చే రెండు రోజులు వానలు: ఆ తర్వాత తీవ్రమైన ఎండలు, ఎల్లో అలర్ట్
- Sports ఆ భారత కుర్రాడు మామూలోడు కాదు- లారా
- Technology స్మార్ట్వాచ్ సెగ్మెంట్లోకి ప్రముఖ సంస్థ.. 8 రోజుల బ్యాటరీ లైఫ్, హెల్త్ ట్రాకర్లతో ProWatch విడుదల..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
మా నాన్న చనిపోతూ...: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం
ప్రముఖ రచయిత, నటుడు తణికెళ్ల భరిణి 'మిథునం'అనే ఓ ఫీచర్ ఫిల్మ్ ని డైరక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మి ప్రధాన పాత్రలుగా రూపొందిన ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. శ్రీరమణ 'మిథునం' కథ ఆధారంగా రూపొందించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తైంది. రీసెంట్ గా విడుదల అయిన ఈ చిత్రం పాటలు అందరినీ అలరిస్తున్నాయి. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది.
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ''మిథునం' కథను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన శ్రీరమణ గారికి అభినందనలు. తనికెళ్ల భరణి నాకు తెలిసిన వాడైనందుకు చాలా గర్వపడుతున్నాను. 'మిథునం' అచ్చమైన తెలుగు సినిమా. ఇలాంటి సినిమాలు రావాలి... అందరూ ఆదరించాలి. ఈ రోజుల్లో ఒక మంచి సినిమా బైటికి రావాలంటే పురిటి నొప్పులు పడుతోంది. 'మిథునం' లాంటి మంచి సినిమాలకు ప్రభుత్వ పెద్దలు సహకరించాలి. ఓ మామూలు ఇంటిలో ఈ సినిమా చిత్రీకరణ జరిగింది. ఆ ఇంటిని ఈ చిత్రానికి గుర్తుగా ఉంచేస్తానని నిర్మాత చెప్పడం అభినందనీయం' అన్నారు.
'మిథునం' చిత్రం వృద్ధ జంట చుట్టూ తిరుగుతుంది. వీరి ప్రేమాభిమానాలు ప్రధానాంశంగా జీవన వేదాతం ఇమిడి కథ నడుస్తుంది. ఇదే కథలో గతంలో మళయాళంలో ఓ చిత్రం నిర్మించారు. కానీ అది పెద్దగా ప్రేక్షకాదరణ నోచుకోలేదు. అయితే భరిణిగారు ఈ కథని ఇప్పటి తరానికి అర్దమయ్యేటట్లుగా స్క్రీన్ ప్లే సమకూర్చుకుని,అందరూ చూసేటట్లుగా రూపొందించానని చెప్తున్నారు. రీసెంట్ గా ఈ చిత్రం మీడియా వారికి ప్రదర్శించారు. అందరూ ఈ చిత్రం బావుందని ప్రదర్శించారు.