Don't Miss!
- News మేషరాశిలో శుక్రుడు.. ఈ రాశులవారికి తీవ్ర అనారోగ్యం.. జాగ్రత్త!!
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
జూనియర్ హీరోల హంగామా పూర్తి..సీనియర్ హీరోల హంగామా స్టార్ట్
మాజీ బావ-బావమరుదులైన నాగార్జు, వెంకటేష్ ల మద్య రసవత్తర పోరుకు తెర లేస్తోంది. నాగ్ నటిస్తున్న 'రగడ", వెంకటేష్ నటిస్తున్న 'నాగవల్లి" చిత్రాలు ఒకేసారి విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రెండు చిత్రాల్లోనూ కథానాయిక అనుష్క కావడం ఇక్కడ మరింత ఆసక్తికరం. అలాగే...'రగడ"లో అనుష్కతోపాటు ప్రియమణి, చార్మి సెకండ్ అండ్ థర్డ్ హీరోయిన్లుగా నటిస్తుండగా, 'నాగవల్లి" లోనూ అనుష్కతో పాటు రిచా గంగోపాధ్యాయ, కమలినీ ముఖర్జీ, పూనమ్ కైర్, శ్రద్దాదాస్ ఇతర హీరోయిన్లుగా నటిస్తుండడం విశేషం.
అన్ని రకాలుగా సమ స్థాయిలో ఉన్న ఈ రెండు చిత్రాలు ఒకేసారి విడుదలయ్యేలా ఉండడం చర్చనీయాంశమవుతోంది. తొలుత 'నాగవల్లి" చిత్రాన్ని డిసెంబర్ 2న విడుదల చేయనున్నారని వార్తలు వచ్చినప్పుటికీ..అప్పటికి పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యే అవకాశాలు లేనందున..ఈ చిత్రం కూడా డిసెంబర్ మూడో వారంలోనే విడుదల కానుందని తెలుస్తోంది.
అయితే 'రగడ" చిత్రాన్ని డిసెంబర్ 17న విడుదల చేస్తున్నామంటూ ఇప్పటికీ నాగార్జున స్వయంగా ప్రకటించారు. ఈ నేపద్యంలో నాగ్-వెంకీల నడుమ పోటీ అనివార్యం కానుందని సమాచారం. అయితే...లాస్ట్ మినిట్ లో మాజీ బావ-బావమరుదులిద్దరూ రామానాయుడు స్టూడియోలో కానీ, అన్నపూర్ణ స్టూడియోలో కానీ ప్రశాంతంగా కూర్చుని సమస్యను సామరస్యంగా పరిష్కరించుకునే అవకాశాలు లేకపోలేదు.