Don't Miss!
- News Rahul Gandhi: ఇది నా గ్యారంటీ-సీబీఐ, ఈడీలకు రాహుల్ వార్నింగ్-బీజేపీ సర్కార్ మారగానే..!
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Sports SRH Playing XI: ఆ బౌలర్పై వేటు.. గుజరాత్తో తలపడే సన్రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇదే!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
సెన్సార్ కు వెళుతున్న 'శ్రీరామ రాజ్యం'..ఈ నెల 17న విడుదల....!
రామాయణం అంటే రాముడొక్కడే కాదు. అది అయోధ్యకు మాత్రమే పరిమితం కాదు. ఆ కథ లోకరీతిని, కళ్లకు కడుతుంది. ఎన్నిసార్లు చూసినా మరో కొత్త కోణం మిగిలే ఉంటుంది. దాన్నే మేం 'శ్రీ రామరాజ్యం"లో చూపిస్తున్నాం అంటున్నారు బాలకృష్ణ. నందమూరి బాలకృష్ణ శ్రీరాముడుగా, నయనతార సీతాదేవిగా రూపొందిన 'శ్రీరామరాజ్యం' చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెన్సార్ కు వెళుతోంది.
మహా దర్శకుడు బాపు రూపొందించిన ఈ దృశ్యకావ్యాన్ని శుక్రవారం (నవంబర్ 11) నాడు సెన్సార్ సబ్యులు తిలకించనున్నారు. తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ఈ చిత్రాన్ని నిర్మించాలన్న తన చిరకాల కోరిక నెరవేరుతున్నందుకు నిర్మాత యలమంచిలి సాయిబాబు ఆనందంగా వున్నారు.
తండ్రి ఎన్టీఆర్ కు తగ్గ రీతిలో శ్రీరాముడి పాత్ర పోషణలో బాలకృష్ణ అద్భుతంగా ఒదిగిపోయారని ఆయన అంటున్నారు. 'పురాణ గాథను నవతరానికి నచ్చేలా తీర్చిదిద్దుతున్నాం. శ్రీరాముడు వనవాసం నుంచి తిరిగి రావడంతో ఈ కథ మొదలవుతుంది. ఇది ఉత్తర రామాయణంలోని అంశాల్ని చూపిస్తుందన్నారు. ఇళయరాజా స్వరాలు సినిమాకు వన్నె తెచ్చాయని నిర్మాత అన్నారు. బాలకృష్ణ అభిమానులు ఎప్పుడెప్పుడా అని వేయికళ్లతో ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఈ నెల 17 న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోంది.