Don't Miss!
- Sports వేరీజ్ `మ్యాడ్` మ్యాక్సీ: ఆర్సీబీలో గందరగోళం
- News వైసీపీ అభ్యర్థికి జగన్ బంపర్ ఆఫర్.. పులివెందుల నుంచి పోటీ చేయలంటూ సూచన
- Finance Bank Holidays: ఏప్రిల్ లో 14 రోజులు బ్యాంకులకు సెలవులు..
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
నవ్వుతూ వెళ్లి విగతజీవిగా.. స్వదేశానికి శ్రీదేవి భౌతికకాయం.. అర్ధరాత్రికి ముంబైకి..
గత మూడురోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠ, ఊహాగానాలను చెక్ పెడుతూ.. శ్రీదేవి మృతదేహం స్వదేశానికి పయనమైంది. శనివారం రాత్రి అందాల తార శ్రీదేవి ప్రమాదవశాత్తు దుబాయ్లోని ఓ హోటల్ బాత్రూంలోని టబ్లో మునిగి చనిపోయిన సంగతి తెలిసిందే. తన మేనల్లుడు మొహిత్ మార్వా పెళ్లి కోసం సంతోషంతో దుబాయ్కి వెళ్లిన శ్రీదేవి విగతజీవిగా రావడం కోట్లాది మంది అభిమానులను కంటతడి పెట్టించే విధంగా మారింది.
గుండెపోటుతో మరణించారనే
శ్రీదేవి గుండెపోటుతో మరణించారనే ముందుగా వార్తలు వచ్చాయి. అయితే ఫొరెన్సిక్ రిపోర్టుల్లో ప్రమాదవశాత్తూ మునిగి చనిపోయిందని తేలడంతో అనేక అనుమానాలు తలెత్తాయి. దాంతో కేసును దుబాయ్ ప్రాసిక్యూషన్కు అప్పగించారు.
ప్రాసిక్యూషన్ క్లియరెన్స్
దుబాయ్ ప్రాసిక్యూషన్ క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇచ్చిన నేపథ్యంలో మంగళవారం మధ్నాహ్నం శ్రీదేవి పార్దీవదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. దాంతో శ్రీదేవి దేహానికి ఎంబామింగ్ నిర్వహించి స్వదేశానికి తీసుకొస్తున్నారు.
స్వదేశానికి శ్రీదేవి మృతదేహం
భారత కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో శ్రీదేవి మృతదేహం స్వదేశానికి ప్రయాణమైంది. పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ ఏర్పాటు చేసిన విమానంలో శ్రీదేవి మృతదేహాన్ని తీసుకొస్తున్నారు.
అర్ధరాతికి ముంబైకి
శ్రీదేవి భౌతికకాయం మంగళవారం అర్ధరాతి సుమారు 11 గంటల ప్రాంతంలో ముంబైకి చేరుకొనే అవకాశం ఉంది. గత మూడురోజులుగా ఎందరో అభిమానులు శ్రీదేవిని కడసారి చూసేందుకు వేచిచూస్తున్నారు.
అంత్యక్రియలకు ఏర్పాట్లు
కాగా, శ్రీదేవి అంత్యక్రియలను ముంబైలోని పవన్ హన్స్ శ్మశాన వాటికలో నిర్వహించనున్నారు. ఈ మేరకు శ్మాశన వాటికలో శుద్ధి కార్యక్రమాలు, ఇతర ఏర్పాట్లు చేస్తున్నారు.
భారీ సంఖ్యలో
ఇప్పటికే శ్రీదేవి, అనిల్ కపూర్ నివాసం వద్ద భారీ సంఖ్యలో అభిమానులు చేరుకొన్నారు. అభిమానులు విషాదవదనంతో శ్రీదేవిని కడసారి చూసేందుకు వేచి చూస్తున్నారు.