Don't Miss!
- Lifestyle చాణక్య నీతి ప్రకారం, ఈ అలవాట్లు మీకు తెలియకుండానే మీ సంపదను పూర్తిగా నాశనం చేస్తాయి...!
- News రిజర్వేషన్లు రద్దు చేస్తారు: మోడీ, కేసీఆర్పై రేవంత్ సంచలన ఆరోపణలు
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
శ్రీహరి అంత్యక్రియలకు ఏర్పాట్లు
హైదరాబాద్ : బుధవారం సాయంత్రం ముంబయిలో తుదిశ్వాస విడిచిన సినీ నటుడు శ్రీహరి అంత్యక్రియలు రంగారెడ్డి జిల్లా బాచుపల్లిలోని ఫాంహౌస్లో నిర్వహించనున్నారు. శ్రీహరి భౌతికకాయాన్ని అభిమానుల సందర్శనార్థం ఫిలించాంబర్లో ఈ రోజు ఉదయం ఉంచనున్నారు. శ్రీహరి పార్థివ దేహానికి గురువారం బాచుపల్లిలోని సొంత వ్యవసాయ క్షేత్రంలో ఆయన కూతురి సమాధి పక్కనే అంత్యక్రియలు జరుపుతున్నట్లు దక్షిణ భారత చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు సి.కల్యాణ్ తెలిపారు.
మెున్నటి పుట్టినరోజు నాడు.. ఇంకో 20ఏళ్లు నటుడిగా కొనసాగుతానని మాటిచ్చిన డాక్టర్ శ్రీహరి అనూహ్యంగా వీడి వెళ్లిపోవటం ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. తెలుగు సినీప్రేక్షకుల్ని, యావత్ తెలుగు సినీపరిశ్రమని నివ్వెరపర్చిన ఘటన ఇది. శ్రీహరి గత కొంతకాలంగా కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్నారు. ఇటీవలి 'తుఫాన్' ఆడియో వేడుకలో సైతం అతడు చాలా బలహీనంగా కనిపించినా ఎవరూ ఈ మరణాన్ని ఊహించలేకపోయారు.
నిన్న ఉదయం ముంబైలో 'రాంబో రాజ్కుమార్' షూటింగ్ స్పాట్లో అనూహ్యంగా కుప్పకూలిన శ్రీహరిని సమీపంలోని లీలావతి ఆసుపత్రిలో చేర్చినా ప్రయోజనం లేకపో రుుంది. ప్రాణాంతక వ్యాధితో చికిత్స పొందుతూ మరణించారు. ఈ వార్త విన్న వెంటనే.. తెలుగు సినీపరిశ్రమ యావత్తు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఓ గొప్ప నటుడిని కోల్పోయామని మా అసోసియేషన్, ఫిలింఛాంబర్, దర్శకసంఘం, నిర్మాతల మండలి సభ్యులంతా ఆవేదన వ్యక్తం చేశారు.
శ్రీహరి వయసు 49 సంవత్సరాలు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన భార్య డిస్కోశాంతి నటిగా, డాన్సర్గా సినీ పరిక్షిశమలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. శ్రీహరి, శాంతిలది ప్రేమ వివాహం. వీరికి ఇద్దరు కుమారులతోపాటు ఓ పాప కూడా జన్మించింది. అయితే నాలుగు నెలల వయసులో ఆ పాప చనిపోయింది. దీంతో ఆమె జ్ఞాపకార్థం అక్షర ఫౌండేషన్ను స్థాపించి మేడ్చల్ మండలంలోని నాలుగు గ్రామాలను దత్తత తీసుకుని సేవా కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు.