శ్రీనువైట్ల,రూప...కలిసి టూర్..ఇదిగో సాక్ష్యం(ఫొటో)
హైదరాబాద్: శ్రీను వైట్ల భార్య రీసెంట్ గా హెరాస్ మెంట్ కేసు విషయమై వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. అన్ని ప్రముఖ మీడియాల్లోనూ ఇది హైలెట్ వార్తగా వచ్చింది. ఈ విషయమై అందరూ షాక్ కు గురి అయ్యారు. ఎందుకంటే వీరిద్దరూ ఇండస్ట్రీలో బెస్ట్ కపుల్ అని చెప్పుకుంటూంటారు కాబట్టి. అయితే పరిశ్రమలో కొందరి పెద్దలు జోక్యం వల్ల అంతా సెట్ అయ్యింది. ఈ కపుల్ తమ పిల్లలను తీసుకుని చైనా ట్రిప్ కు వెళ్లి వచ్చారు. ఆ ఫొటోను రూప వైట్ల సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ద్వారా షేర్ చేసింది.
కేసు విషయమై...రూపవైట్ల ఏమంటారంటే..తాను తాను తన భర్త శ్రీను వైట్లపై ఏ విధమైన కేసు ఫైల్ చేయలేదని అన్నారు. అయితే తాను పోలీసులకు కంప్లైన్ చేసానని అన్నారు. అదీ కూడా కేవలం శ్రీను వైట్ల తనను అక్టోబర్ 12, 13 తేదీలలో కొట్టారని మాత్రమే అని అన్నారు.

అలాగే ఈ సంఘటన అక్టోబర్ 13న జరిగిందని, చిత్రంగా అక్టోబర్ 26న వెలుగులోకి వచ్చిందని, అదీ రూపావైట్ల..కంప్లైంట్ విత్ డ్రా చేసుకోవటానికి పోలీస్ స్టేషన్ కి వచ్చినప్పుడు మాత్రమే అని తెలిసింది. బ్రూస్ లీ పరాజయం తో వచ్చిన డిస్ట్రబెన్సెస్ ..ఈ జంట మధ్య పొరపచ్చాలు తెచ్చి ఉండవచ్చని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు తెలిసినదాన్ని బట్టి బ్రూస్ లీ రిలీజ్ ముందే ఈ జంట మధ్య చిన్న గొడవలు వచ్చి, ఆవేశంలో పోలీస్ స్టేషన్ దాకా వెళ్లాయని అర్దమవుతోంది.


Click it and Unblock the Notifications











