కళ్లు తిప్పుకోరు: శృతి హాసన్ ఫిల్మ్ ఫేర్ (ఫొటోలు)
హైదరాబాద్: కమల్ హాసన్ కూతురు గా ఇండస్ట్రీకి పరిచయమై శృతి హాసన్ గా తన కంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుని ఎదుగుతూ... ‘గబ్బర్ సింగ్' తో బాగా పాపులర్ అయిపోయింది. ఫ్యాషన్ మీద ఎక్కువగా ఆసక్తిని, శ్రద్దను చూపుతోంది.
అటు సినిమాల్లో బిజీగా ఉంటూనే ఇలా అప్పుడప్పుడూ ఫ్యాషన్ మీద మక్కువను కనబరుస్తోంది. ఇది ఆమె అభిమానుకులకు కనుల పండుగే అని చెప్పవచ్చు. రీసెంట్ గా...ఆమె ఫిల్మ్ ఫేర్ ఫంక్షన్ లో ...తన అందాలతో అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ ఫొటోలునూ మీరు చూడండి.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ 2015 ఫంక్షన్ లో శృతి హాసన్ను చూసి అక్కడి వారందరు ఒక్కసారి ఆశ్చర్యానికి గురైయ్యారు. ఎందుకంటే బాడీషేప్ కు ఫర్ ఫెక్ట్ గా ఫిట్ అయ్యే డ్రెస్సును ధరించడంతో పాటు, షట్టర్ బగ్స్ కోసం ఒక క్యూట్ ఫోజ్ ను ఇచ్చింది. శ్రుతి హాసన్ సూపర్ గ్లామర్ హీరోయిన్ గా అవతారమెత్తిందనటానికి ఈ క్రింది ఫోటోలే నిదర్శనం.
స్లైడ్ షో లో ...ఫోటోలు

ఫామ్ లోకి...
శృతి హాసన్... గబ్బర్ సింగ్ తర్వాత రామ్ చరణ్ తో, తర్వాత అల్లు అర్జున్ తో ఇలా మెగా ఫ్యామీతో బాగా ఫామ్ లోకి వచ్చేసింది.

హిట్ హీరోయిన్ నుంచి హాట్ గా...
గబ్బర్ సింగ్ చిత్రంతో ఒక్కసారిగా హిట్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న శ్రుతి హాసన్.. రామ్ చరణ్, అల్లు అర్జున్ సరసన నటించి హాట్ హీరోయిన్ గా మారింది.

మెగా ఫ్యామిలీకి..
ఒకరకంగా మెగా ఫ్యామిలీ హీరోయిన్గా మారిపోయింది. తమిళంలోనూ, బాలీవుడ్లోనూ చిత్రాల్తో బిజీగా ఉన్న శ్రుతి హాసన్.. రేసుగుర్రంలో అల్లు అర్జున్ సరసన నటించి మెప్పించింది.

చెన్నైలో..
62వ సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డుల ఫంక్షన్ శుక్రవారం చెన్నైలోని ఇండోర్ స్టేడియంలో అట్టహాసంగా జరిగింది.

తమిళ,తెలుగు
ఈ కార్యక్రమానికి టాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు.

స్టార్స్ అంతా
అక్కినేని నాగార్జున, అల్లు అరవింద్, అల్లు అర్జున్, కమల్ హాసన్, మమ్ముట్టి, జయప్రద, రాధిక, మంచు లక్ష్మి, కాజల్, తమన్నా, రకుల్ వంటి నటులు అవార్డ్స్ ఫంక్షన్లో పాల్గొన్నారు.

బాల్య నటిగా...
2000లో తన తండ్రి కమల్ హాసన్ దర్శకత్వంలో తెరకెక్కిన "హే రాం" సినిమాలో బాల్యనటిగా నటించింది.

సంగీతంపైనే...
శ్రుతి హాసన్ ఆ తర్వాత సంగీతానికి సంబంధించిన విషయాలపై శ్రద్ధ చూపింది.

"లక్" తో అన్ లక్
2008లో సోహం షా దర్శకత్వంలో తెరకెక్కిన "లక్" సినిమాలో ఇమ్రాన్ ఖాన్ సరసన నటిగా తొలిసినిమా చేసింది. ఆ సినిమా ఘోరపరాజయాని చవిచూసింది.

నటన బాగోలేదన్నారు
శ్రుతికి కూడా తన నటనకు విమర్శకుల నుంచి ప్రతికూల స్పందన వచ్చింది.

సూర్య ప్రకాష్ దర్శకత్వంలో
2011లో కె.రాఘవేంద్రరావు గారి కొడుకైన కె.ప్రకాష్ దర్శకత్వంలో సిద్దార్థ్ సరసన "అనగనగా ఓ ధీరుడు" సినిమాలో నటించింది.

మళ్లీ పరాజయమే ..కానీ అవార్డు
విమర్శకుల నుంచి తన నటనకు ప్రశంసలనందుకున్న శ్రుతికి మాత్రం ఈ సినిమా కమర్షియల్ గా పరాజయంగానే మిగిలింది.కానీ ఆ సంవత్సరానికి తను ఉత్తమ తెలుగు నూతన నటి విభాగంలో దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డును పొందింది.

హిందీలో అతిధిగా..
అదే సంవత్సరంలో "దిల్ తో బచ్చాహై జీ" సినిమాలో అతిథి పాత్రలో నటించింది.

సెవెంత్ సెన్స్
శ్రుతి ఆపై ఏ.ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో సూర్య సరసన "7అం అరివు" సినిమాలో నటించింది. సెవెంత్ సెన్స్ పేరుతో తెలుగులో విడుదలైన ఈ సినిమా విజయం సాధించింది.

అవార్డు వచ్చింది
శ్రుతికి కూడా తన నటనకు గుర్తింపు లభించడమే కాకుండా ఉత్తమ తమిళ నూతన నటి విభాగంలో దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డును సొంతం చేసుకుంది.

అదే సంవత్సరం
ఆ సంవత్సరంలో తన చివరి సినిమా సిద్ధార్థ్ సరసన "ఓ మై ఫ్రెండ్" సినిమాలో నటించింది "ఇద్దరు మిత్రులు" సినిమాకి దగ్గరగా ఉండే ఈ సినిమా ఓ మోస్తరు విజయాన్ని సాధించింది.

ధనుష్ సరసన..
ధనుష్ సరసన 3 సినిమాలో నటించి విమర్శకులనుంచి ప్రశంసలనందుకుంది.

గబ్బర్ సింగ్ తో ...
తర్వాత శ్రుతి హాసన్ హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ సరసన "గబ్బర్ సింగ్" సినిమాలో నటించింది.

అది మొదలు
గబ్బర్ సింగ్ సినిమా భారీ విజయాన్ని సాధించడమే కాక విమర్శకుల మరియూ ప్రేక్షకుల దృష్టిలో శ్రుతి హాసన్ స్థాయిని పెంచింది.
తనని నటిగా తెలుగు సినిమాల్లో నిలబెట్టింది.

తర్వాత...హిట్
గబ్బర్ సింగ్ తర్వాత శ్రుతి తెలుగులో రవితేజ సరసన "బలుపు" చేసింది.

మళ్లీ ఫ్లాఫ్
, జూనియర్ ఎన్.టి.ఆర్. సరసన "రామయ్యా వస్తావయ్యా"..అది డిజాస్టర్ అయ్యింది

ఒక హిట్..రెండు ఫ్లాపులు
రాంచరణ్ తేజ సరసన ఎవడు, హిందీలో ప్రభుదేవ దర్శకత్వంలో "రామయ్యా వస్తావయ్యా", "డీ-డే" సినిమాల్లో నటించింది


Click it and Unblock the Notifications











