Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
వాడి పోలికలతో పుడతారనేది రాజమౌళికి బాగా నచ్చింది
హైదరాబాద్: " పిల్లలు మాత్రం వాడి పోలికలతో పుడతారు " అంటూ ఆటోనగర్ సూర్య చిత్రంలో సమంత...అజయ్ తో చెప్పే డైలాగు బాగా పేలింది. ఇప్పుడు అదే డైలాగు తన పర్శనల్ ఫేవెరెట్ అంటున్నారు రాజమౌళి. రీసెంట్ గా ఆటోనగర్ సూర్య చిత్రం చూసిన రాజమౌళి ఆ ఎక్సపీరియన్స్ ని తన అభిమానులతో సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో పంచుకున్నారు. అక్కడ రాస్తూ ఈ విషయాన్ని ప్రస్దావించారు.
రాజమౌళి ట్వీట్ చేస్తూ.... యూనియన్ వ్యతిరేకంగా పోరాడే ఓ ఒంటరి కథని తెరకు ఎక్కించిన దేవకట్టాగారి గట్స్ ని నేను అభినందిస్తున్నాను. అతని డైలాగులు పంచ్ తో బాగున్నాయి . " పిల్లలు మాత్రం వాడి పోలికలతో పుడతారు " మాత్రం నా పర్శనల్ ఫేవెరెట్. ట్రిమ్ చేయటం తప్పనిసరి..అది త్వరగా చేసారు అన్నారు.
ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ..ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం 'బాహుబలి'. రానా ముఖ్యభూమిక పోషిస్తున్నారు. అనుష్క, తమన్నా హీరోయిన్స్. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్సిటీలో చిత్రీకరణ సాగుతోంది. కొన్ని నెలలుగా అక్కడ యుద్ధం నేపథ్యంలో కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. 2000 మంది కళాకారులపై చిత్రీకరణ జరుపుతున్నారు. ఈ చిత్రాన్ని ఆర్కా మీడియా సంస్థ నిర్మిస్తోంది.
ప్రభాస్, రానా, అనుష్క ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు. కె.రాఘవేంద్రరావు సమర్పకులు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. అనంతరం ఇతర భాషల్లో అనువదించి ఒకేసారి విడుదల చేస్తారు. ఈ సినిమాకోసం ఇప్పటికే ప్రధాన తారాగణమంతా కత్తి యుద్ధాలు, గుర్రపుస్వారీ నేర్చుకొంది.