Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
భేష్ రాజమౌళి.. జక్కన్నపై సజ్జనార్ ప్రశంసల వర్షం,, మాట తప్పలేదంటూ
బాహుబలి చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతిని సంపాదించిన దర్శకుడు రాజమౌళి కరోనావైరస్ పడ్డారనే వార్తతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఆయన వ్యాధి నుంచి బయటపడాలని ఫ్యాన్స్, స్నేహితులు, సన్నిహితులు ప్రార్థించారు. రెండు వారాల తర్వాత ఆయన కరోనా నుంచి సంపూర్ణంగా బయటపడ్డారు. దాంతో అందరూ ఊపిరి పీల్చుకొన్నారు. అయితే కరోనా సమయంలో ఇచ్చిన మాటను రాజమౌళి నిలబెట్టుకోవడంపై ఆయన అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. జక్కన నిలబెట్టుకొన్న మాట ఏమిటంటే..
Recommended Video
కరోనా పేషెంట్లకు ప్లాస్మా
కరోనా పేషెంట్లకు ప్లాస్మా అవసరం ఎక్కువగా ఉంటుంది. అలాంటి సమయంలో ప్లాస్మా ఎక్కడ లభ్యమవుతుంది. ప్లాస్మా కోసం ఎవరిని సంప్రదించాలనే పరిస్థితుల్లో సోసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కంట్రోల్ (SCSC), సైబరాబాద్ పోలీసులు సంయుక్తంగా donateplasma.scsc.in అనే వెబ్సైట్ను అందుబాటులోకి తెచ్చారు. ప్లాస్మా అవసరమైన వాళ్లు, ప్లాస్మాదాతలు కూడా తమ పేర్లను నమోదు చేసుకొనే విధంగా వెసలుబాటును కల్పించారు. ఈ నేపథ్యంలో రాజమౌళి దంపతులు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఆఫీస్ను సందర్శించారు.
కరోనావైరస్ తగ్గిన తర్వాత దానం చేస్తా
రాజమౌళి కరోనా సోకిన వెంటనే.. నాకు ఆయన కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది అంటూ ట్వీట్ చేశారు. త్వరలోనే ఈ వ్యాధి నుంచి బయటపడి ప్లాస్మా డొనేట్ చేస్తాను అని హామీ ఇచ్చారు. తాను ఇచ్చిన హామీకి కట్టుబడి.. కరోనావైరస్ను జయించిన రాజమౌళి దంపతులు బుధవారం సైబరాబాద్ కమిషనర్ కార్యాలయంలో ప్లాస్మా డొనేట్ చేశారు.
రాజమౌళి దంపతులను సత్కరించిన సజ్జనార్
సైబారాబాద్ పోలీసులు అధికారులు నిర్వహించిన క్యాంపులో రాజమౌళి దంపతులతోపాటు ఎంఎం కీరవాణి దంపతులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్లాస్మా దాతలను సైబరాబాద్ పోలీసులు సత్కరించారు. ఇతర దాతలతోపాటు రాజమౌళి కుటుంబ సభ్యులు కూడా ఈ సత్కారాన్ని పొందారు. ఈ సత్కారానికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
రాజమౌళి ఫ్యామిలీపై ప్రశంసల వర్షం
ఎస్ఎస్ రాజమౌళి దంపతులను కమిషనర్ సజ్జనార్ సత్కరించారు. శాలువా కప్పి చిత్ర పటాన్ని బహుకరించారు. ఈ సందర్బంగా రాజమౌళిని, రమారాజమౌళిని పోలీసు అధికారులు అభినందించారు. ప్లాస్మాదానం చేయడం వల్ల మరో ఇద్దరి ప్రాణాలను కాపాడిన వారయ్యారంటూ కితాబు ఇచ్చారు. సెలబ్రిటీ వల్ల ఈ గొప్ప కార్యక్రమంపై ప్రజల అవగాహన కలుగుతుందనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేశారు. గతంలో విజయ్ దేవరకొండ, చిరంజీవి, నాగార్జున లాంటి ప్రముఖులు ఇలాంటి కార్యక్రమంలో పాలుపంచుకొన్నారు.
తొలి సెలబ్రిటీలుగా రాజమౌళి దంపతుల రికార్డు
సైబరాబాద్ పోలీసుల నిర్వహిస్తున్న క్యాంపులో ప్లాస్మా దానం చేయడం ద్వారా రాజమౌళి కుటుంబ ఓ అరుదైన గుర్తింపును పొందారు. ఇలాంటి కార్యక్రమాలంలో దాతలుగా మారిన తొలి సెలబ్రిటీలుగా ఓ ఘనతను సొంతం చేసుకొన్నారు. గతంలో విజయ్ దేవరకొండ పోలీసులు నిర్వహించిన కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ఏదో ఒకరు కరోనా బారిన పడుతాను. అప్పుడు నేను కూడా ప్లాస్మా దానం చేస్తానని అన్నారు. ా
RRR మూవీతో ప్రేక్షకుల ముందుకు
బాహుబలి మూవీ తర్వాత రాజమౌళి రూపొందిస్తున్న చిత్రం RRR. రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. కరోనా పరిస్థితులు విజృంభణ కారణంగా షూటింగ్ వాయిదా పడింది. త్వరలోనే ఈ సినిమా షూటింగును ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.