Don't Miss!
- News Atchannaidu: అచ్చెన్నాయుడికి ఎన్నికల వేళ హైకోర్టులో భారీ ఊరట..!
- Finance Ambani-Adani: చేతులు కలిపిన అంబానీ-అదానీ.. 20 ఏళ్లకు అగ్రిమెంట్.. ఆ స్టాక్ దూకుడు..
- Automobiles హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
- Sports హార్దిక్పై కోపంగా మలింగ.. కారణమదేనా? Video
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
బాహుబలి2: ప్రభాస్ కంటే ఎక్కువ రెమ్యునరేషన్ ఎవరికో తెలుసా! రానా కాదు..
భారతీయ సినిమా కలెక్షన్ల రికార్డులను తిరగరాస్తూ బాహుబలి2 చిత్రం తొలిసారి రూ.1000 కోట్ల క్లబ్లోకి చేరింది. ఇండియన్ సినిమాకు సంబంధించిన దాదాపు 30 రికార్డులను బ్రేక్ చేసింది.
బాహుబలి సినిమా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నది. భారతీయ సినిమా కలెక్షన్ల రికార్డులను తిరగరాస్తూ ఈ చిత్రం తొలిసారి రూ.1000 కోట్ల క్లబ్లోకి చేరింది. ఇండియన్ సినిమాకు సంబంధించిన దాదాపు 30 రికార్డులను బ్రేక్ చేసింది. చరిత్రాత్మక విజయాన్ని అందుకొన్న ఈ చిత్రానికి పనిచేసిన వారు భారీగా రెమ్యునరేషన్ అందుకొన్నారు. ప్రస్తుతం ఫిలిం ఇండస్ట్రీలో బాహుబలి తారలు, సాంకేతిక వర్గాల రెమ్యునరేషన్ చర్చనీయాంశమైంది. బాహుబలిగా నటించిన ప్రభాస్ కంటే అధికంగా పారితోషికం అందుకొన్న వారు ఎవరంటే..
రానాకు రూ.15 కోట్లు.. ప్రభాస్ 25 కోట్లు
బాహుబలి సినిమాలో నటించినందుకు గాను రానా దగ్గుబాటి రూ.15 కోట్లు, తమన్నా భాటియా, అనుష్క చెరో రూ.5 కోట్లు, రమ్యకృష్ణ రూ.2.5 కోట్ల పారితోషికాన్ని అందుకొన్నారు. ప్రభాస్కు రూ.25 కోట్ల రెమ్యునరేషన్ లభించింది. బాహుబలికి సంబంధించినంత వరకు తారలు అందుకొన్న అధిక రెమ్యునరేషన్లు.
భారీగా రాజమౌళికి..
కానీ బాహుబలికి మూలపురుషుడు, విలక్షణమైన విజన్తో హిస్టారికల్ మూవీని అందించిన రాజమౌళి రెమ్యునరేషన్ మాత్రం తెలిస్తే కళ్లు చెదిరిపోవాల్సిందే. ఈ సినిమా కోసం లాభాల్లో వాటాతోపాటు రూ.28 కోట్ల రూపాయల పారితోషికాన్ని రాజమౌళి అందుకొన్నట్టు సమాచారం. రెమ్యునరేషన్ విషయం పక్కన పడితే ప్రపంచవ్యాప్తంగా ఏ సినిమా ప్రముఖుడికి రాని క్రెడిట్ ఒక్క బాహుబలితోనే రాజమౌళి సంపాదించుకోవడం గమనార్హం.
1500 కోట్ల వైపు..
ఐదేళ్ల బాహుబలి నిర్మాణం తర్వాత ప్రస్తుతం రాజమౌళి కుటుంబంతోపాటు విహార యాత్రకు వెళ్లినట్టు సమాచారం. బాహుబలి చిత్రం సృష్టిస్తున్న హంగామాను చూసి ప్రస్తుతం రాజమౌళి ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా బాహుబలి చిత్రం రూ.1200 కోట్ల వసూలు చేసింది. రూ.1500 కోట్ల మైలురాయిని అధిగమించేందుకు సిద్దమవుతున్నది.
వెకేషన్లో ప్రభాస్..
బాహుబలిగా దేశవ్యాప్త ఆదరణను చూరగొన్న ప్రభాస్ అమెరికాలో వెకెషన్ టైమ్ను ఎంజాయ్ చేస్తున్నారు. విహారయాత్ర తర్వాత అమెరికాలో ప్రారంభమయ్యే సాహో చిత్ర షూటింగ్లో పాల్గొంటారు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ఇటీవల విడుదలై మంచి రెస్పాన్స్ను కూడగట్టుకొంటున్నది. సాహో చిత్రానికి సుజిత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.