Don't Miss!
- News ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
దిల్ రాజు సినిమా... సమంత చేతుల మీదగా ఆడియో రిలీజ్ ఈ రోజే
హైదరాబాద్ : శివకార్తికేయన్, కీర్తిసురేష్ జంటగా బక్కియ రాజ్ కన్నన్ దర్శకత్వంలో రూపొందిన లవ్ ఎంటర్టైనర్ రెమో. ఈ చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో 24 ఎ.ఎం.స్టూడియోస్ బ్యానర్పై ఆర్.డి.రాజా సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్రాజు విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ఆడియో ఈ రోజు (నవంబర్ 1) న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
ఇక ఈ చిత్రం యొక్క ఆడియో ఈరోజు సాయంత్రం హైదరాబాద్ లోని పార్క్ హయాత్ హోటల్లో భారీ ఎత్తున జరగనుంది. ఈ ఆడియోను తెలుగు స్టార్ హీరోయిన్ సమంత చేతులమీదగా విడుదల చేయనున్నట్లు సమాచారం. సమంత..గతంలోదిల్ రాజు బ్యానర్ లో సినిమాలు చేసిన విషయం తెలిసిందే.
దిల్ రాజు మాట్లాడుతూ - "హీరో శివకార్తికేయన్ రెమో సినిమాలో మూడు వేరియేషన్స్లో అద్భుతంగా యాక్ట్ చేశాడు. పి.సి.శ్రీరాంగారి సినిమాటోగ్రఫీ, అనిరుధ్ సంగీతం సినిమాకు మరింత సపోర్ట్ చేశాయి. రెమో ష్యూర్ షాట్ హిట్ మూవీ అవుతుంది. డెబ్యూ డైరెక్టర్ బక్కియ రాజ్ కన్నన్ చేసిన సినిమా తమిళనాడులో 65-70 కోట్లు కలెక్ట్ చేయడం చిన్న విషయం కాదు. రెమో సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుతున్న శివకార్తికేయన్కు అభినందనలు. ఈ చిత్రం ఆడియో నవంబర్ 1 న విడుదల అవుతుంది" అన్నారు.
మొదటిసారి శివకార్తికేయన్ చిత్రం తెలుగులోకి విడుదల అవుతుండటంతో సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడానికి డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు గట్టి ప్రమోషన్లు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. 'నేను శైలజా' చిత్రంతో తెలుగు ఆడియన్స్ కి పరియచం అయిన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించడంతో తెలుగులో సైతం ఈ సినిమాపై క్రేజ్ క్రియేట్ అవుతోంది. ఇకపోతే బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి పిసి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించగా, అనిరుద్ సంగీతం సమకూర్చారు.