Don't Miss!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- News వివేకా హత్యపై మాట్లాడొద్దు- కడప కోర్టు సంచలన ఆదేశాలు..!
- Lifestyle అరెంజ్ మ్యారెజ్ చేసుకోవాలనుకుంటున్నారా ? అయితే ఈ ముఖ్యమైన విషయాలను తెలుసుకోవాల్సిందే..
- Sports IPL 2024 ఫిక్సింగ్ కలకలం.. నలుగురు అరెస్ట్!
- Technology Samsung నుంచి కొత్త 8K మరియు 4K AI టీవీ లు లాంచ్ అయ్యాయి! ధర, ఫీచర్లు, ఆఫర్లు
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
అటు బన్ని డాన్స్..ఇటు బాలయ్య పాట (వీడియో)
హైదరాబాద్: వెలుగు జిలుగుల మధ్య.. తారల హంగామాతో అంగరంగ వైభవంగా సాగిన సౌత్ ఇండియన్ మూవీ అవార్డ్స్(సైమా)-2015 వేడుక ముగిసింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో దక్షిణాది సినీ పరిశ్రమకు చెందిన తారలంతా ఒక్కచోట చేరి ప్రేక్షకులకు కనువిందు చేశారు. తొలిరోజు తెలుగు, కన్నడ, రెండో రోజు తమిళం, మలయాళం విజేతలకు అవార్డులనందించారు.
తమిళ హీరో ధనుష్, హన్సిక, సంగీత దర్శకుడు అనిరుధ్ తదితరులు అవార్డులు అందుకున్నవారిలో ఉన్నారు. మురుగాదాస్ దర్శకత్వంలో రూపొందిన 'కత్తి' ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. శ్రుతిహాసన్ తన నృత్య ప్రదర్శనతో ఉర్రూతలూగించింది. తారల హంగామాతో సైమా వేడుక సందడిగా సాగింది. ఈ అవార్డుల పంక్షన్ కు సంభందించిన ప్రోమో ఇక్కడ చూడండి.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ ఆవార్డ్స్ (సైమా) నిర్వహించిన ఈ 'కన్నుల పండుగ'లో దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలకు చెందిన హేమాహేమీలు, యువ తరంగాలు సందడి చేశాయి. రెండు రోజుల పాటు సాగిన వేడుకలో తొలి రోజు తారల హుషారుకి ఈ చిత్రాలే గీటురాళ్లు. హీరోయిన్స్ తమ అందచందాలతో నియాన్ లైట్ల వెలుగులను చిన్నబోయేలా చేశారు.
ఈ సందడి నడుమ గతేడాదికిగాను తెలుగు, కన్నడ పరిశ్రమలకు సంబంధించిన విజేతలకు పురస్కారాలు అందించారు.దివంగత ప్రముఖ నిర్మాత రామానాయుడు జ్ఞాపకార్థం బాలకృష్ణ, అల్లు అరవింద్, భారతీరాజా, సుహాసిని చేతులమీదుగా రామానాయుడు కుటుంబ సభ్యులు వెంకటేష్, రానా, నాగచైతన్యకు జ్ఞాపికను అందజేశారు.ప్రముఖ గాయని ఉషా ఉతుప్ హుషారైన గానంతో అలరించారు. బాలకృష్ణ, వెంకటేష్ ఆమెతో గొంతు కలిపి డ్యాన్స్లూ చేశారు.
కుష్బూ, శ్రుతి హాసన్ వీళ్లతో కాలు కదిపి మరింత ఉత్సాహాన్ని పెంచారు.బాలకృష్ణ, రాశీ ఖాన్నా, చంద్రబోస్, పీటర్ హెయిన్స్, శ్రియ, సుహాసిని, బ్రహ్మానందం, శ్రుతి హాసన్ పురస్కారాలందుకున్నారు.ప్రణీత, పూజా హెగ్డే, అదా శర్మ, శ్రియ, అమలాపాల్ నృత్యాలు ఆకర్షణగా నిలిచాయి.దేవిశ్రీప్రసాద్, మంచు లక్ష్మీప్రసన్న, ఛార్మి, పూజా కుమార్, రెజీనా, సోనాల్ చౌహాన్, తదితరులు హాజరయ్యారు.'