వివరణ : నేను చేస్తున్నా...మహేష్ బాబు కాదు

ఇక సుధీర్బాబు, నందిత జంటగా నటిస్తున్న చిత్రం 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని'. కన్నడంలో విజయవంతమైన 'చార్మినార్'కిది రీమేక్. మాతృకను తెరకెక్కించిన ఆర్.చంద్రునే ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. శిరీషా శ్రీధర్ నిర్మాతలు.
సుధీర్ బాబు మాట్లాడుతూ ''ఇప్పటివరకు నేను చేసిన సినిమాలన్నీ వినోద ప్రధానమైనవే. ఈ సినిమా వాటికి భిన్నంగా పాత రోజుల్ని గుర్తు చేసేలా ఉంటుంది'' అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ''కుటుంబం, స్నేహితులు, ప్రేమ.. ఈ అంశాల మధ్య కథ నడుస్తుంది. కృష్ణమ్మకు సినిమాకు సంబంధమేంటనేది తెరపై చూడాల్సిందే'' అన్నారు.
సినిమాలో గిరిబాబు, ఎమ్మెస్ నారాయణ, సారిక రామచంద్రరావు, చిట్టిబాబు, కిషోర్దాస్, అభిజిత్ తదితరులు ఇతర పాత్రధారులు. సంగీతం: హరి, మాటలు: ఖదీర్బాబు, ఛాయాగ్రహణం: కె.ఎస్.చంద్రశేఖర్, కళ: నారాయణరెడ్డి
ఇంతకుముందు కన్నడ చిత్రం గోవిందాయనమహ ని పోటుగాడు గా రీమేక్ చేసిన శ్రీధర్ ...ఈ ఛార్మినార్ చిత్రం సైతం తనకు విజయం ఇస్తుందని భావిస్తున్నారు. ఈ చిత్రంలో సుధీర్ బాబు సరసన నందిత హీరోయిన్ గా ఎంపికైంది. ప్రేమ కధా చిత్రం కాంబినేషన్ కావటంతో బిజినెస్ బాగా జరుగుతుందని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











