Don't Miss!
- News కర్ణాటకలో నేడు పోలింగ్ జరిగే లోక్సభ నియోజకవర్గాలు ఇవే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
దేవిశ్రీ హీరోగా సినిమాపై మౌనం వీడిన సుకుమార్
హైదరాబాద్: సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను నిర్మించబోతున్న దిల్ రాజు ఆ మద్య స్వయంగా ఈ ప్రాజెక్టు గురించి అఫీషియల్ ప్రకటన చేసారు. అ ప్రాజెక్టు గురించి ప్రకటనైతే చేసారు కానీ ఎలాంటి వివరాలు వెల్లడించారు.
ఈ ప్రాజెక్టు ప్రకటించి చాలా రోజులైనా ఇప్పటికీ ఎలాంటి పురోగతి లేదు. కనీసం సినిమా ఎలా ఉండబోతోందనే క్లూ కూడా దిల్ రాజు నుండి గానీ, దేవిశ్రీ, సుకుమార్ నుండి గానీ ఇప్పటి వరకు బయటకు రాలేదు. అయితే ఎట్టకేలకు ఈ ప్రాజెక్టు విషయమై సుకుమార్ మౌనం వీడారు.
సుకుమార్ దర్శకత్వం వహించిన ‘నాన్నకు ప్రేమతో' చిత్రం మంచి విజయం సాధించడం, రూ. 50 కోట్ల షేర్ సాధించడంతో సుకుమార్ చాలా హ్యాపీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన కోనసీమ ప్రాంతంలో పర్యటిస్తూ తన స్నేహితులను, బంధువులను కలుస్తూ రిలాక్స్ అవుతున్నారు.
ఈ నేపథ్యంలో అక్కడ ఎదురుపడ్డ మీడియాకు తన తర్వాతి ప్రాజెక్టు గురించి తెలిపారు సుకుమార్. దేవిశ్రీ ప్రసాద్ తో తాను చేయబోయే తర్వాతి సినిమా కోనసీమ బ్యాక్ డ్రాపులో ఫ్యామిలీ ఎంటర్టెనర్ గా ఉంటుందని స్పష్టం చేసారు. అదే విధంగా తన తర్వాతి ప్రాజెక్టులను గురించి తెలిపారు. రామ్ చరణ్, అల్లు అర్జున్ తో సినిమా ఓకే అయినట్లు తెలిపాురు.