Don't Miss!
- News ఎన్నికల వేళ విశాఖ కేంద్రంగా బొత్సా కీలక ప్రకటన..!!
- Technology 24GB వరకు RAM, 50MP సెల్ఫీ కెమెరా, మూడు 50MP వెనక కెమెరాలతో కొత్త ఫోన్ లాంచ్!
- Lifestyle Gruha Pravesham Wishe in Telugu : గృహప్రవేశం శుభాకాంక్షలను ఇలా తెలపండి..
- Finance Success Story: పుట్టింది చిన్న టైలర్ కొడుకుగా.. ప్రస్తుతం బిలియనీర్.. ఇదిరా సక్సెస్ అంటే..
- Sports ధోనీని ఒప్పించడం కష్టమే..ఆ ఫేక్ న్యూస్ నమ్మొద్దు- రోహిత్
- Automobiles జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
అలాంటి పరిస్థితి ఉంటే ఇండియాలో ఉండేదాన్నేకాదు: సన్నీ లియోన్
హైదరాబాద్: గత కొన్ని నెలలుగా ఇండియాలో మత అసహనం అంశంపై పెద్ద వివాదమే సాగుతోంది. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ హయాంలో దేశంలో మత అసహనం పెరిగిపోతోందంటూ ప్రముఖ రచయితలు, మేధావులు, కొందరు సినీ ప్రముఖులు తమ అవార్డులను వెనక్కి ఇస్తున్న సంగతి తెలిసిందే.
ఈ పరిణామాలపై వివాదాస్పద కామెంట్స్ చేసిన బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ విమర్శలు ఎదుర్కొన్నారు. దేశంలో అసహనం ఉన్న మాట వాస్తవమే, నా భార్య ఈ దేశం వదిలి వెళ్లి పోదాం అని అడగుతోంది అంటూ అమీర్ ఖాన్ చేసిన కామెంట్స్ ఆయన్ను ఇబ్బందుల్లో నెట్టేసింది.
అయితే మాజీ పోర్న్ స్టార్, ప్రస్తుతం బాలీవుల్లో సెక్సీ హీరోయిన్ సన్నీ లియోన్ మాత్రం ఈ అంశంపై డిఫరెంటుగా స్పందించారు. ఆమె తన వ్యాఖ్యలతో ఆమె ఎంతో మంది హృదయాలు గెలుచుకుంది. ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా ఆమె ఈ విషయమై జాగ్రత్తగా స్పందించారు.
‘అసహనం అనే పదాన్ని వాడటం ఆసక్తికరంగా ఉంది. నేను ఇండియాను ఎంతో ప్రేమిస్తున్నారు. ఈ దేశంలో అసహనం అనేది ఉండి ఉంటే నేను ఇంత సేఫ్ గా ఉండేదాన్నికాదు. ఈ దేశంలో సహనం వర్దిల్లుతోంది అని సన్నీ లియోన్ చెప్పుకొచ్చారు.