రాగిణి ఎంఎస్ఎస్ 2: మరో గర్ల్తో సన్నీ లియోన్ లిప్లాక్
ముంబై: సన్నీ లియోన్ హీరోయిన్గా ఏక్తా కపూర్ నిర్మించిన చిత్రం 'రాగిణి ఎంఎంఎస్ 2'. ప్రస్తుతం ఈచిత్రానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఈచిత్రంలో హీరోయిన్ సన్నీ లియోన్ కేవలం పురుషులతోనే కాదు, మహిళలతోనూ లిప్ లాక్ సన్నివేశాల్లో పాల్గొన్నట్లు స్పష్టం అవుతోంది. అందుకు సంబంధించిన ఫోటోలు ఇటీవల విడుదలైన నెట్లో హల్ చల్ చేస్తున్నాయి.
సంధ్యా మృదుల్ అనే నటితో కలిసి సన్నీ లియోన్ ఈ ముద్దు సీన్లో పాల్గొందు. ఈ సీన్ చూస్తుంటే.....'రాగిణి ఎంఎంఎస్ 2' చిత్రంలో హోమో సెక్సువల్ సన్నివేశాలు కూడా ఉన్నాయని స్పష్టమవుతోంది. హారర్ అండ్ సెక్స్ ఎలిమెంట్స్తో కూడిన ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త థ్రిల్ ఇస్తుందని అంటున్నారు.

ఈచిత్రానికి భూషణ్ పటేల్ దర్శకత్వం వహిస్తున్నారు. మార్చి 21న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్లు, పోస్టర్లు సినిమాలో హారర్ డోసుతో పాటు గ్లామర్ డోసు కూడా బాగానే ఉందని స్పష్టమవుతోంది. ఇటీవల విడుదలైన పోస్టర్లలో సన్నీ లియోన్ ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా నగ్నంగా ఉండటం శృంగార ప్రియుల్లో సినిమాపై అంచనాలు మరింత పెంచేలా చేసింది.
ఇలాంటి పోస్టర్లు రిలీజ్ చేయడం వల్ల సినిమాకు ఓపెనింగ్స్ బాగా వస్తాయని అంచనా వేస్తున్నారు ట్రేడ్ వర్గాలు. ఏది ఏమైనా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న లేడీ నిర్మాత ఏక్తా కపూర్ శృంగార ప్రియుల టేస్ట్ ఎలా ఉంటుందో పర్ఫెక్టుగా ఊహించినట్లుంది. బాలాజీ మోషన్స్ పిక్చర్స్, ఎఎల్టి ఎంటర్టెన్మెంట్స్ బ్యానర్లపై ఏక్తా కపూర్, శోభా కపూర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











