Don't Miss!
- Sports RCB vs KKR: విరాట్ కోహ్లీ ట్రేడ్ మార్క్ సిక్సర్.. బిత్తరపోయిన మిచెల్ స్టార్క్! వీడియో
- News జైల్లో చిప్పకూడే.: కేటీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
- Automobiles గిఫ్ట్ అంటే అబ్బాయిలే ఇవ్వాలా.??.. పెళ్లిలో వరుడికి వధువు అదిరిపోయే బైక్ గిఫ్ట్.. వైరల్ వీడియో చూసేయండి
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
రామ్ చరణ్-సురేందర్ రెడ్డి కాంబినేషన్లో సినిమా
రేస్ గుర్రం' చిత్రం షూటింగులో బిజీగా గడుపుతున్న సురేందర్ రెడ్డి దీని తర్వాత రామ్ చరణ్తో చేయబోయే చిత్రంపై పూర్తి దృష్టి పెట్టనున్నాడు. కమర్షియల్ ఎంటర్టెనర్గా ఈచిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్న ఆయన, రామ్ చరణ్ స్థాయి మరింత పెంచేలా పకడ్భంధీగా స్క్రిప్టు రెడీ చేయనున్నారట.
'అతనొక్కడే' చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయిన సురేందర్ రెడ్డి 'కిక్' చిత్రం భారీ విజయం సాధించడంతో స్టార్ దర్శకుల జాబితాలో చేరిపోయాడు. ఇప్పటి వరకు ఆయన జూ ఎన్టీఆర్తో 'అశోక్', 'ఊసరవెల్లి', మహేష్ బాబుతో 'అతిథి' చిత్రాలను తెరకెక్కించాడు.
'రేస్ గుర్రం' సినిమా విషయానికొస్తే...అల్లు అర్జున్, శృతి హాసన్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈచిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ క్యారెక్టర్ను సరికొత్త లుక్తో, సరికొత్త మేనరిజం, స్టైల్తో చూపింబోతున్నా దర్శకుడు సురేందర్ రెడ్డి. నల్లమలుపు శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈచిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.