Don't Miss!
- News పురందేశ్వరికి చెక్ పెడుతోందెవరు - చంద్రబాబు ఎటువైపు..!?
- Automobiles టెస్లా, బీవైడీలకు పోటీగా Xiaomi SU7 ఎలక్ట్రిక్ కారు లాంచ్.. 810 కి.మీ రేంజ్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Finance CRAMC IPO: త్వరలో కెనరా రోబెకో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఐపీఓ..!
- Sports హేటర్స్ ఎంతకు తెగించారు: చివరికి హార్దిక్ పాండ్యా వైఫ్ను కూడా
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
సురేష్ కొండేటి చేతికి సిద్ధార్థ కొత్త చిత్రం..డిటేల్స్
హైదరాబాద్ : వరసగా డబ్బింగ్ సినిమాలు అందిస్తూ టేస్ట్ ఉన్న నిర్మాతగా ఎదుగుతున్న సురేష్ కొండేటి మరో చిత్రం డబ్ చేస్తూ వార్తల్లోకి వచ్చారు. పిజ్జా సినిమాతో దర్శకునిగా తన ప్రతిభ నిరూపించుకున్న కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెలుగు తమిళ భాషల్లో రూపొందుతున్న జిగర్తతండా అనే సినిమాను ఎస్.కె. పిక్చర్స్, వియస్ఆర్ ప్రొడక్షన్స్ వారు సంయుక్తంగా ఈ సినిమాను తెలుగు వారికి అందిస్తున్నారు. సిద్ధార్థ్, లక్ష్మీ మీనన్ లు నటిస్తున్న ఈ సినిమా ఒక షెడ్యూల్ మినహా పూర్తయింది.
సురేష్ కొండేటి మాట్లాడుతూతొలి చిత్రం పిజ్జా తో కార్తిక్ సుబ్బరాజు మంచి దర్శకునిగా నిరూపించుకున్నారు. మలి ప్రయత్నంగా ఓ వినూత్న కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నగర నేపధ్యంలో సాగే యాక్షన్ డ్రామా ఇది. యువతరాన్ని ఆకట్టుకునే కథ మా కాంబినేషన్ లో వచ్చిన పిజ్జా ఘనవిజం సాధించిన విషయం తెలిసిందే. సిద్ధార్థ్ సినిమాను చేయడం ఆనందంగా ఉంది వేసవి లో విడుదల కానున్న ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం ఉంది అన్నారు.