Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఇంతా చేస్తే కలర్స్ స్వాతి కొద్దిసేపే కనపడుతుంది
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం..అప్పలరాజు చిత్రంలో నటిస్తున్న కలర్స్ స్వాతి..రామ్ హీరోగా రూపొందనున్న కందిరీగ చిత్రంలో నటించనుందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.అయితే ఆ చిత్రంలో కలర్స్ స్వాతి కేవలం గెస్ట్ అప్పీరియెన్స్ అనీ, కొద్ది నిముషాల పాటే కనిపిస్తుందని తెలుస్తోంది. బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మస్కాలో రామ్ సరసన చేసిన హన్సిక హీరోయిన్ గా చేస్తోంది. ఈ చిత్రం ద్వారా సంతోష్ శ్రీనివాసన్ అనే కొత్త దర్శకుడు పరిచయమవుతున్నారు. త్వరలోనే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రంతో పాటు కలర్స్ స్వాతి..సుమంత్ సరసన..'అష్టాచెమ్మా" చిత్రంతో విజయం సాధించిన ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తోంది. పూర్తి స్ధాయి ఎంటర్టైన్మెంట్ తో ఉండే ఈ చిత్రానికి 'అష్టాచెమ్మా" తరహాలోనే వినోదాత్మకంగా ఉంటుందంటున్నారు. ది మేన్ వితిన్ అనే పుస్తకం ఆధారంగా ఈ చిత్రం రూపొందనుంది. క్రికెట్ బ్యాక్ గ్రౌండ్ గా ఈ చిత్రం కథ నడుస్తుంది. హరి మోహన్ కథ అందిస్తున్నారు.