ప్రభాస్ సరసన తమన్నానే కన్ఫర్మ్
తమన్నాకు ఇప్పడున్నీ హ్యాపీడేసే నడుస్తున్నాయి.ఎక్కడెక్కడి ఆఫర్స్ ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి. తాజాగా ఆమె ప్రభాస్ సరసన ఎంపికైంది.ప్రభాస్,లారెన్స్ కాంబినేషన్ లో రూపొందే చిత్రంలో ఆమెను హీరోయిన్ గా ఫైనల్ చేసారు.మొదట అనూష్కని తీసుకున్న లారెన్స్ ఆమెను సరిగ్గా ట్రీట్ చేయటంతో ఆమె ప్రాజెక్టు నుంచి తప్పుకుంది.దాంతో ఇప్పుడా ప్లేస్ లోకి తమన్నాని తీసుకువచ్చి ప్రభాస్ ని శాంతింప చేసాడు.ఇక అనూష్క బయిటకు వెళ్ళిన దగ్గరనుండి ప్రభాస్ ఓ రేంజిలో లారెన్స్ పై ఫైర్ అవుతున్నాడు.దాంతో లారెన్స్ జాగ్రత్తగా తమన్నాని ఒప్పించుకుని ప్రభాస్ ని ఖుషీ చేసాడు.ఇక ప్రస్తున్న తమన్నా ఎన్టీఆర్ సరసన సురేంద్ర రెడ్డి దర్సకత్వంలో ఊసరివిల్లి చిత్రంలో చేస్తోంది.అలాగే రామ్ చరణ్ సరసన రచ్చ చిత్రంలోనూ నటిస్తోంది.దాంతో వచ్చే సంవత్సరం మొత్తం తమన్నా సినిమాలే రిలీజ్ అయ్యే వాతావరణం కనపడుతోంది.మరో రెండు పెద్ద హీరోల సినిమాల్లోనూ తమన్నానే అడుగుతున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











