Don't Miss!
- Sports ఆ రూల్ మా కొంపముంచింది- రుతురాజ్
- News మే 1 నుంచి ఈ రాశులకు అఖండ ధనయోగం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
నానా పాటేకర్ చుట్టు బిగుస్తున్న ఉచ్చు.. రంగంలోకి మహిళా కమిషన్!
ప్రముఖ నటుడు నానా పాటేకర్ లైంగికంగా వేధించారని ఆరోపణలు చేస్తూ నటి తనుశ్రీ దత్తా చేసిన ఫిర్యాదుపై మహారాష్ట్ర మహిళా కమిషన్ స్పందించింది. 2008లో హార్న్ ఓకే ప్లీజ్ అనే సినిమా షూటింగ్లో తనను చెప్పరాని చోట తాకుతూ, అసభ్యకరమైన నృత్యాలు చేయాలని లైంగికంగా వేధించారని ఇటీవల నానా పాటేకర్పై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో నానా పాటేకర్ చుట్టు కేసు వల బిగుసుకొంటున్నట్టు కనిపిస్తున్నది. వివరాల్లోకి వెళితే..
బాలీవుడ్లో తను శ్రీ ప్రకంపనలు
తను శ్రీ దత్తా ఆరోపణలు బాలీవుడ్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తనుశ్రీ దత్తా ఆరోపణల తర్వాత పలువురు తారలు తమకు జరిగిన అన్యాయాన్ని బయటపెడుతున్నారు. ఈ నేపథ్యంలో హర్న్ ఒకే ప్లీజ్ చిత్ర దర్శకుడు రాకేష్ సారంగ్, కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య, నిర్మాత సమీ సిద్ధిఖీ, హీరో నానాపాటేకర్కు నోటీసులు జారీ చేసింది.
నానా పాటేకర్కు నోటీసులు
తనుశ్రీ దత్తా ఫిర్యాదు నేపథ్యంలో నలుగురికి నోటీసులు జారీ చేశాం. పది రోజుల్లోగా వాటికి జవాబివ్వాలని ఆదేశించాం అని మహారాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ రహాత్కర్ వెల్లడించారు. అలాగే తనుశ్రీ దత్తా ఫిర్యాదుపై స్పందించిన అవసరమైన చర్యలు తీసుకోవాలని ముంబై పోలీసులకు కూడా నోటీసు పంపామని ఆమె పేర్కొన్నారు.
తనుశ్రీ దత్తా ఫిర్యాదుపై
తనుశ్రీ దత్తా ఫిర్యాదును తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఆమెను స్వయంగా కమిషన్ ముందు హాజరుకావాలని కోరాం. తనుశ్రీ దత్తా ఫిర్యాదులపై నానాతోపాటు మరో ముగ్గురిని తమ వాదనలను వినిపించమని కోరాం. శనివారంలోగా ఎలాంటి దర్యాప్తు, చర్యలు తీసుకొన్నారో శనివారం వెల్లడించాలని ముంబై పోలీసులను కోరాం అని కమిషన్ ఓ వీడియో ప్రకటన చేసింది.
నిర్మాతలు, మూవీ ఆర్టిస్టులతో
తను శ్రీ దత్తా ఆరోపణల నేపథ్యంలో సినీ నిర్మాతలను, మీడియా సంస్థలను, సినీ ఆర్టిస్టుల అసోసియేషన్తో సంప్రదింపులు జరుపుతున్నాం. బాలీవుడ్లో మహిళా నటులు చేస్తున్న ఆరోపణలపై స్పందించడానికి ఓ కమిటీని ఏర్పాటు చేయమని అడిగాం. మూవీ ఆర్టిస్టు అసోసియేషన్కు, ప్రొడక్షన్ హౌస్లకు లేఖలు రాశాం అని విజయ రహత్కర్ వెల్లడించారు.