పూరీ జగన్నాధ్ చిత్రం ఎందుకు రిజెక్టు చేసానంటే?: తాప్సీ

By Srikanya

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో హిందీలో అమితాబ్‌కు జంటగా నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి..అయితే కాల్‌షీట్స్ సమస్య కారణంగా తాను అంగీకరించలేదని తాప్సీ చెప్పింది. అమితాబ్ లాంటి గొప్ప నటుడితో నటించాలనే కోరిక ఏ హీరోయిన్‌కైనా ఉంటుందన్నారు. అలాంటి అవకాశం వచ్చినా వదులుకోవాల్సి రావడం బాధ కలిగించిందని వివరణ ఇచ్చింది. అమితాబ్ తో పూరి రూపొందించనున్న చిత్రం టైటిల్ బుడ్డ. ఆ చిత్రంలో ఆమె సోనూసూద్ సరసన చేయమని అడిగారు. ఇక ఈ బుడ్డ చిత్రం పిబ్రవరి 23వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. అలాగే చిరుత ఫేమ్ నేహాశర్మ కూడా ఈ చిత్రంలో ఓ ప్రధానపాత్ర ఫోషించనుంది. ఇక అమితాబ్ కి జంటగా టబు కనిపించనుంది. ఇంతకు ముందు వీరిద్దరు కాంబినేషన్ లో చీనికామ్ చిత్రం వచ్చి విజయవంతమైంది. ప్రస్తుతం పూరి జగన్నాధ్...రానా, ఇలియానాలు కాంబినేషన్లో "నేను నా రాక్షసి" చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఆ తర్వాత మహేష్, పూరీ కాంబినేషన్ లో ది బిజినెస్ మెన్ చిత్రం రూపొందనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X