Don't Miss!
- Sports DC vs GT: రఫ్ఫాడించిన ముఖేష్ కుమార్.. ఓడిపోయే మ్యాచ్లో గెలిచిన ఢిల్లీ!
- News హైదరాబాద్, కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థులు వీరే: ఖమ్మంలో హీరో వెంకటేష్ వియ్యంకుడు
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
బిగ్బాస్ లో మరో ఇద్దరు హీరోయిన్స్: ఎన్టీఆర్ కోసమే ఈ ప్రత్యేక ఏర్పాటు చేసారా??
సినిమాల ప్రమోషన్స్ కోసం ఇప్పటికే ఎంతో మంది నటీనటులు బిగ్బాస్ హౌస్కు వెళ్లొచ్చారు. అదే బాటలో ‘జై లవకుశ’ హీరోయిన్లు రాశీఖన్నా, నివేదా థామస్ బిగ్బాస్లోకి వెళ్లారు.
Recommended Video
ఇప్పటి వరకూ వెండితెరపై నట విశ్వరూపం చూపిన ఎన్టీఆర్ తొలిసారి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న రియాల్టీ షో 'బిగ్బాస్'. హిందీలో విశేష ప్రేక్షకాదరణ పొందిన ఈ కార్యక్రమానికి తెలుగులో రూపొందించారుయంగ్ టైగర్' జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా ఉన్న ఈ షో ని తమ సినిమా ప్రమోషన్లకోసం వాడుకున్నాయి కొన్ని సినిమాలు.
నేనే రాజూ నేనే మంత్రి
నేనే రాజూ నేనే మంత్రి సమయం లో రానా, ఆనందో బ్రహ్మ సమయం లో తాప్సీ బిగ్ బాస్ హౌస్ లో సందది చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా వంతు వచ్చింది అయితీ ఈ సారి హోస్ట్ కాబట్టి జూనియర్ వెళ్ళటానికి అవకాశం లేదు కాబట్టి ఇద్దరు హీరోయిన్ లు బిగ్ బాస్ ఇంట్లోకి అడుగుపెట్టారు.
రాశీఖన్నా, నివేదా థామస్ బిగ్బాస్లో
యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న బిగ్బాస్ రియాల్టీ షోకు ఇద్దరు స్టార్ హీరోయిన్స్ అతిథులుగా వెళ్తున్నారు. సినిమాల ప్రమోషన్స్ కోసం ఇప్పటికే ఎంతో మంది నటీనటులు బిగ్బాస్ హౌస్కు వెళ్లొచ్చారు. అదే బాటలో ‘జై లవకుశ' హీరోయిన్లు రాశీఖన్నా, నివేదా థామస్ బిగ్బాస్లోకి వెళ్లారు.
రాశీ ఖన్నా తన ఫేస్బుక్ పేజ్ లో
శనివారం రాత్రి ప్రసారం అయ్యే ఎపిసోడ్లో రాశీఖన్నా, నివేదా థామస్ కనిపిస్తారు. ఈ మేరకు రాశీ ఖన్నా తన ఫ్వేస్బుక్ పేజ్ లో ఒక పోస్ట్ కూడా పెట్టేసింది. శనివారం ఎన్టీఆర్ ఉంటారు కాబట్టి.. రాశీఖన్నా, నివేదా బిగ్బాస్లోకి వెళ్లడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది.
ఈ నెల 21న విడుదల
ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసిన ‘జై లవకుశ' ఈ నెల 21న విడుదల అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శని, ఆది రెండు రోజులూ బిగ్బాస్లో ‘జై లవకుశ' ప్రమోషన్స్ ఉండబోతున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ ఎలాగో వ్యాఖ్యతగా ఉండనే ఉన్నారు. ఇక హీరోయిన్స్ కూడా వస్తుండడంతో బుల్లితెర ప్రేక్షకులకు పండగే అని చెప్పాలి.