Don't Miss!
- News బీఆర్ఎస్కు భారీ షాక్: ఎంపీ కే కేశవరావు, మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్లోకి
- Sports RR vs DC: రియాన్ పరాగ్ విధ్వంసం.. 6 బంతుల్లో 5 బౌండరీలు!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
హాట్ టాపిక్ : జూ ఎన్టీఆర్కి తారకరత్న కౌంటర్ కారణం?
హైదరాబాద్ : ఫిల్మ్ సర్కిల్స్ లోనూ, మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు నందమూరి వారసులు జూ. ఎన్టీఆర్, తారకరత్న. ఎన్టీఆర్ అన్నమాటకి తారకరత్న ఇచ్చిన కౌంటర్, దానికి కారణం ఏంటనే విషయమే మాట్లాడుకుంటున్నారు. మహానాడుకు రావాలని తనకు పిలుపు రాలేదని, పార్టీ పిలిస్తే హాజరవుతానని జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు. తారకరత్న ఈ మాటకు కౌంటర్ గా సమాధాన మిచ్చారు.
జూ. ఎన్టీఆర్ అన్న ఆహ్వానంచలేదు అన్న మాటకు ...ఆహ్వానంతో పనేంటి? అని తారకరత్న అన్నారు. మహానాడుకు తనకు ఆహ్వానం అందలేదన్న జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యలపై సినీ నటుడు తారకరత్నలు స్పందించారు. తారకరత్న మంగళవారం మహానాడులో కొంతసేపు గడిపారు. మీడియా అడిగిన ప్రశ్నలకు బదులిచ్చారు.
జూనియర్ ఎన్టీఆర్కు ఆహ్వానం అందలేదట కదా! అన్న ప్రశ్నకు.. ''ఈరోజు ఎన్టీఆర్ జయంతి. ఆ సందర్భంగానే మహానాడు నిర్వహిస్తున్నారు. ఇది నందమూరి కుటుంబ పండగ. దీనికి ఆహ్వానంతో పనేంటి? ఇది అంతా హాజరుకావాల్సిన కార్యక్రమం. పార్టీకి నందమూరి కుటుంబం ఎప్పుడూ అండగా ఉండాలి'' అని బదులిచ్చారు.
గతంలోనూ ఎన్టీఆర్ గా తన పేరుని మార్చుకునే ప్రయత్నం నందీశ్వరుడు చిత్రంతో చేసారు తారకరత్న. అయితే ఆ సినిమా విజయవంతం కాకపోవటంతో ఆ పేరుతో ఆయన పాపులర్ కాలేదు. మొదటినుంచి ఆయన ఎన్టీఆర్ తో పోటీ పడాలనే ప్రయత్నం కనపడుతోందని అంటున్నారు.
మరోవైపు నందమూరి బాలకృష్ణకు కూడా ఆహ్వానం పంపలేదని, తండ్రి జయంతి కార్యక్రమం సందర్భంగా మహానాడుకు ఆయనే రావడం ఆనవాయితీ అని, ఈసారీ అలాగే వచ్చారని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఇక ఎన్టీఆర్ ..తనను ఆహ్వానిస్తే రానున్న ఎన్నికల్లోనూ ప్రచారమూ చేస్తానని తెలిపారు. తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జయంతి కార్యక్రమం మంగళవారం సచివాలయం సమీపంలోని ఎన్టీఆర్ఘాట్లో జరిగింది. ఉదయాన్నే తొలుత జూనియర్ ఎన్టీఆర్ దంపతులు అక్కడికి చేరుకుని నివాళులు అర్పించారు. తాతగారు పెట్టిన ఈ పార్టీ 2014లో విజయం సాధిస్తుందన్నారు.