మహేష్ బాబు మల్టీప్లెక్స్ ఇంద్రలోకమే: తరణ్ ఆదర్శ్ ఫిదా (ఫోటోస్)
Recommended Video

మహేష్ బాబు, ఏసియన్ సినిమాస్ కలిసి నిర్మించిన 'ఎఎంబి సినిమాస్' (ఏసియన్ మహేష్ బాబు సినిమాస్) ఆదివారం గ్రాండ్గా లాంచ్ అయిన సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ కృష్ణ చేతుల మీదుగా ఈ మల్టీప్లెక్స్ ప్రారంభించారు.
7 స్క్రీన్లు, 1638 సీటింగ్ కెపాసిటీతో ఉన్న ఈ మల్టీప్లెక్స్ ప్రారంభోత్సవానికి ప్రముఖ సినీ వ్యాపార విశ్లేషకుడు, క్రిటిక్ తరణ్ ఆదర్శ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన 'ఎఎంబి సినిమాస్' నిర్మించిన తీరు చూసి ఆశ్చర్యపోయారు. ఇందులోకి వెళితే ఇంద్రలోకంలోకి వెళ్లినట్లు ఉందనే భావన వ్యక్తం చేశారు.
ఫోటోస్ షేర్ చేసిన తరణ్
ఎఎంబి సినిమాస్ ప్రారంభోత్సవం సినీ ప్రముఖుల ఆధ్వర్యంలో కన్నుల పండుగలా జరిగిందని... టెక్నాలజీ, ఇంటీరియర్ డిజైనింగ్ కలగలిపి ఎంతో అద్భుతంగా దీన్ని నిర్మించారని తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మహేష్ బాబు, నమ్రతతో కలిసి దిగిన ఫోటోస్ అభిమానులతో పంచుకున్నారు.
ఇంద్రలోకంలా ఉంది
ప్రముఖ ఆర్కిటెక్ట్ ఎరానా యెక్బోట్ దీన్ని డిజైన్ చేశారని, ఈ మల్టీప్లెక్స్ చూస్తుంటే ఇంద్రభవనంలా ఉందంటూ తరణ్ ఆదర్శ్ ప్రశంసలు గుప్పించారు.
ప్రతి థియేటర్ డిఫరెంటుగా
ఈ మల్టీ ప్లెక్స్లో ప్రతి స్క్రీన్, అందులోని సీటింగ్ డిఫరెంటుగా ఉన్నాయని... ఇందులో సినిమా చూడటం అంటే వరల్డ్ క్లాస్ థియేటర్ ఎక్స్పీరియన్స్ పొందడమే అంటున్నారు తరణ్.
మహేష్ బాబు, నమ్రతకు థాంక్స్
‘ఎఎంబి సినిమాస్' ప్రారంభోత్సవ వేడుకకు తనను ప్రత్యేకంగా ఆహ్వానించడంపై మహేష్ బాబు, నమ్రత, నారంగ్స్కు ఆయన ప్రత్యేక థన్యవాదాలు తెలియజేశారు.


Click it and Unblock the Notifications











