Don't Miss!
- News కేశినేని నాని Vs చిన్ని వార్ లో షర్మిల కొత్త ట్విస్ట్..!!
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports సూపర్మ్యాన్ స్టబ్స్: మెరుపు ఫీల్డింగ్తో ఢిల్లీని గెలిపించాడు! Video
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
పవన్ సినిమాపై కమిటీ దుర్మార్గం-టి సభ్యుల బహిష్కరణ
అయితే కమిటీ వేయడాన్ని అల్లం నారాయణ, ఎన్. శంకర్ తో పాటు పలువురు తెలంగాణ వాదులు వ్యతిరేకిస్తున్నారు. కమిటీ వేయడాన్ని దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు. కమిటీని బహిష్కరిస్తున్నట్లు స్పష్టం చేసారు. కేవలం కమిటీ వేసి అందులో కొన్ని సీన్లు తొలగించినంత మాత్రాన తెలంగాణకు జరిగిన అవమానం మాసిపోదని, సినిమాను నిషేదించాలని తెలంగాణ వాదులు డిమాండ్ చేస్తున్నారు.
టీఆర్ఎస్ నేత శ్రవణ్ మాట్లాడుతూ....సినిమాను తెలంగాణలో ఆడనివ్వబోమని, తెలంగాణ వ్యాప్తంగా సినిమాను అడ్డుకుంటామని తెలిపారు. సినిమా మొత్తం పరోక్షంగా తెలంగాణ ఉద్యమాన్ని కించ పరిచే విధంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేసారు. కాగా....దర్శకుడు పూరి జగన్నాథ్ సినిమాలోని 12 అభ్యంతర కర సీన్లను తొలగించినట్లు ప్రకటించారు. సినిమా ఎవరినీ నొప్పించాలనే ఉద్దేశ్యంతో తీయలేదని స్పష్టం చేసారు.
కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రంలో కొన్ని పాత్రలు, డైలాగులు, సన్నివేశాలు..... కెసిఆర్ను, టీఆర్ఎస్ పార్టీని, ఉద్యమ తీరును కించ పరిచే విధంగా ఉన్నాయంటూ టీఆర్ఎస్ శ్రేణులు తెలంగాణ వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం, పలు చోట్ల ఈ చిత్రం రీళ్లను దగ్ధం చేయడంతో పాటు, ప్లెక్సీలు, కటౌట్లు, పోస్టులు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే.