Don't Miss!
- News పైసాకు పనికిరాని వ్యక్తి పవన్ - చంద్రబాబు..!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సినిమా తీస్తే తెలంగాణా వారికి 40 శాతం అవకాశాలు
తెలుగులో ఏ చిత్రం తీసినా తెలంగాణా వారికి 40 శాతం అవకాశాలు ఇవ్వాలని తెలంగాణ ఫిల్మ్ ప్రొటక్షన్ పోర్స్ డిమాండ్ చేసింది. జెఎసీ కన్వీనర్ కోదండరాం ముఖ్య అతిధిగా బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ నిన్న(సోమవారం) తెలంగాణ ఫిల్మ్ ప్రొటక్షన్ ఫోర్స్ అనే నూతన సంస్ధ ఆవిర్భావం జరిగింది. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ..పెట్టుబడులతో పాటు సంప్రదాయ వారసత్వ పెత్తనానికి తోడు ప్రభుత్వ అండతో కొందరే సినిమా రంగాన్ని శాసిస్తున్నారని అన్నారు. అలాగే ఈ ఫోర్స్ కన్వీనర్ రోశంబాలు, ప్రధాన కార్యదర్శి కడగంజి శ్రీనివాస్ మాట్లాడుతూ...తెలంగాణ టెక్నిషియన్, ఆర్టిస్టులను కాపాడుకోవటం, కొత్తవారికి ప్రోత్సాహమివ్వటం, వారికి ఎటువంటి అన్యాయం జరిగినా తెలంగాణ ఫిల్మ్ ప్రొటక్షన్ ఫోర్స్ ముందుంటుందని అన్నారు. అలాగే తెలంగాణ కళాకారుల గురించి, తెలంగాణ కరువు ప్రాంతాల గురించి చిత్రపరిశ్రమ ఏ రోజూ ఒక్క స్టార్ నైట్ కూడా చెయ్యలేదని అన్నారు.