రాజా వెడ్డింగ్ రిసెప్షన్, రోశయ్య ఆశీస్సులు (ఫోటోలు)
చెన్నై: తెలుగు నటుడు రాజా వివాహం చెన్నైకి చెందిన అమృత విన్నెంట్తో శుక్రవారం సాయంత్రం చెన్నై నుంగంబాక్కంలోని సెయింట్ మేరీసా చర్చిలో జరిగింది. అనంతరం చెన్నై అడయార్ లోని రామనాథన్ శెట్టియార్ హాలులో వెడ్డింగ్ రిసెప్షన్ ఘనంగా జరిగింది.
ఈ వెడ్డింగ్ రిసెప్షన్ కార్యక్రమానికి తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య కూడా హాజరయ్యారు. ఆయనతో పాటు తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు కె.ఆర్, తమిళ నటుడు శ్రీకాంత్, ఎడిటర్ మోహన్ తదితరులు హాజరయ్యారు. వారి సాంప్రదాయం ప్రకారం వెడ్డింగ్ కేక్ కట్ చేయడంతో పాటు, వైన్ సేవించారు.
రాజా-అమృత వెడ్డింగ్ రిసెప్షన్కు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో.....

రోశయ్య ఆశీర్వాదం
తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య రాజా-అమృత వెడ్డింగ్ రిసెప్షన్కు హాజరైన నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ప్రముఖులు
రాజా వెడ్డింగ్ రిసెప్షన్ పార్టీకి పలువురు సినీ ప్రముఖులు హాజయ్యారు.

వెడ్డింగ్ కేక్
రిసెప్షన్ పార్టీ సందర్భంగా వెడ్డింగ్ కేక్ కట్ చేస్తున్న దృశ్యం.

వైన్ తో చీర్స్...
వెడ్డింగ్ రిసెప్షన్ సందర్భంగా వైన్తో అతిథులకు చీర్స్ చెబుతున్న రాజా-అమృత

రాజా స్నేహితులు
రాజా స్నేహితుడైన తమిళ హీరో శ్రీకాంత్తో పాటు ఇతరులు వెడ్డింగ్ రిసెప్షన్కు హాజరైన దృశ్యం

రోశయ్య
వెడ్డింగ్ రిసెప్షన్ సందర్భంగా నూతన వధూవరులు రాజా-అమృతతో కలిసి రోశయ్య ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.


Click it and Unblock the Notifications











