Don't Miss!
- Sports RCB vs KKR: విరాట్ కోహ్లీ ట్రేడ్ మార్క్ సిక్సర్.. బిత్తరపోయిన మిచెల్ స్టార్క్! వీడియో
- News జైల్లో చిప్పకూడే.: కేటీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
- Automobiles గిఫ్ట్ అంటే అబ్బాయిలే ఇవ్వాలా.??.. పెళ్లిలో వరుడికి వధువు అదిరిపోయే బైక్ గిఫ్ట్.. వైరల్ వీడియో చూసేయండి
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
‘టెంపర్’ రి రిలీజ్: కలిసొస్తుందా...?
హైదరాబాద్: యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన ‘టెంపర్' చిత్రం ఫిబ్రవరి 13న విడుదలై మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ బిగ్గెస్ట్ హిట్ చిత్రాల లిస్టులో చేరడంతో పాటు నిర్మాతకు మంచి లాభాలు తెచ్చి పెట్టింది.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని 5 వారం హైదరాబాద్, బెంగుళూరుల్లోని 15 థియేటర్లలో రీ రిలీజ్ చేస్తున్నట్లు సమాచారం. సినిమా విడుదల సమయంలో ఈ థియేటర్లలో సినిమా వేయడంతో పాటు మధ్యలో తీసేసి వేరే సినిమా వేసారు. మళ్లీ ఇపుడు ఆ థియేటర్లలో టెంపర్ రి రిలీజ్ చేయడం చర్చనీయాంశం అయింది. కొత్తగా కొన్ని కామెడీ సీన్లు కూడా యాడ్ చేస్తున్నారు. సీన్లు యాడ్ చేయడం వసూళ్ల పరంగా కలిసొస్తుందని భావిస్తున్నారు.
‘టెంపర్' చిత్రం ఎన్టీఆర్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచింది. ఓవరాల్గా చూసుకుంటే వసూళ్లు బాగానే వచ్చాయి. నిర్మాతకు లాభాలు మిగిలాయి. అయితే ఈ చిత్రానికి గాను ఓ ఏరియా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ సొంతం చేసుకున్న పూరి జగన్నాథ్ మాత్రం లాస్ అయ్యాడని అంటున్నారు.
ఈ చిత్రానికి సంబంధించిన వెస్ట్ గోదావరి రైట్స్ రూ. 2.25 కోట్లకు పూరి సొంతం చేసుకున్నాడు. అయితే ఈ చిత్రం అక్కడ ఇప్పటి వరకు మొత్తం రూ. 1.5 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఇక వసూళు చేసే పరిస్థితి లేదని, ఆ ఏరియాలో ‘టెంపర్' బిజినెస్ దాదాపుగా క్లోజ్ అయినట్లే అని అంటున్నారు. దీంతో పూరికి రూ. 75 లక్షల నష్టం వాటిల్లిందని ఫిల్మ్ నగర్ టాక్. ఇతర ఖర్చులన్నీ కలుపుకుని దాదాపు 1 కోటి లాస్ అని అంటున్నారు.
కాజల్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో ప్రకాష్రాజ్, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, అలీ, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు, మధురిమ బెనర్జి, వెన్నెల కిషోర్, జయప్రకాష్రెడ్డి, సప్తగిరి, కోవై సరళ, రమాప్రభ, పవిత్ర లోకేష్ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ సినిమాకు కథ: వక్కంతం వంశీ, కెమెరా: శ్యామ్ కె నాయుడు, సంగీతం: అనూప్ రూబెన్స్, ఆర్ట్: బ్రహ్మ కడలి, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, ఫైట్స్: విజయ్, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేశ్, స్ర్కీన్ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్.