రామ్ చరణ్ మూవీ నుండి తమన్ ఔట్, ఏమైంది?

కృష్ణ వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్. ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ఈ చిత్రాన్ని పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. నటుడు శ్రీకాంత్ ఈ చిత్రంలో చెర్రీ బాబాయ్ పాత్రలో కనిపించనున్నారు. కమలినీ ముఖర్జీ ముఖ్యమైన పాత్రలో నటిస్తోంది.
ఈ చిత్రంలో రామ్ చరణ్ సొంతగడ్డపై అడుగుపెట్టిన ప్రవాస భారతీయుడిగా పోనీ టెయిల్తో కనిపించనున్నాడు. ఇప్పటికే చిత్ర యూనిట్ కన్యాకుమారి, పొలాచ్చి షెడ్యూల్స్ పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరింది. ఏప్రిల్ రెండోవారం నుంచి హైదరాబాద్ రామానాయుడు సినీ విలేజ్లో ఇల్లు సెట్లో షూటింగ్ ప్లాన్ చేసారు. అనంతరం ఆర్ఎఫ్సిలో తదుపరి షెడ్యూల్ని చిత్రీకరించనున్నారు.
రామ్ చరణ్ నటించిన చివరి చిత్రం 'ఎవడు' బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించింది. ఈ నేపథ్యంలో 'గోవిందుడు అందరి వాడేలే' చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈచిత్రం తర్వత రామ్ చరణ్ శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు.


Click it and Unblock the Notifications











