Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
రామ్ చరణ్ మూవీ నుండి తమన్ ఔట్, ఏమైంది?
కృష్ణ వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్. ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ఈ చిత్రాన్ని పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. నటుడు శ్రీకాంత్ ఈ చిత్రంలో చెర్రీ బాబాయ్ పాత్రలో కనిపించనున్నారు. కమలినీ ముఖర్జీ ముఖ్యమైన పాత్రలో నటిస్తోంది.
ఈ చిత్రంలో రామ్ చరణ్ సొంతగడ్డపై అడుగుపెట్టిన ప్రవాస భారతీయుడిగా పోనీ టెయిల్తో కనిపించనున్నాడు. ఇప్పటికే చిత్ర యూనిట్ కన్యాకుమారి, పొలాచ్చి షెడ్యూల్స్ పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరింది. ఏప్రిల్ రెండోవారం నుంచి హైదరాబాద్ రామానాయుడు సినీ విలేజ్లో ఇల్లు సెట్లో షూటింగ్ ప్లాన్ చేసారు. అనంతరం ఆర్ఎఫ్సిలో తదుపరి షెడ్యూల్ని చిత్రీకరించనున్నారు.
రామ్ చరణ్ నటించిన చివరి చిత్రం 'ఎవడు' బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించింది. ఈ నేపథ్యంలో 'గోవిందుడు అందరి వాడేలే' చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈచిత్రం తర్వత రామ్ చరణ్ శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు.