Don't Miss!
- Technology యూట్యూబ్కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- News బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి
- Sports SRHకు భయపడి CSK సంచలన నిర్ణయం: ధోనీ మైండ్ గేమ్?
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Lifestyle హడలెత్తిస్తున్న Bird Flu పాలు,గుడ్లు మరియు చికెన్ తినడం సురక్షితమేనా?మనుషులకూ వ్యాపిస్తుందా..నిపుణులు ఏమంటారు?
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సంజు డైరెక్టర్ను కలిసిన తరుణ్ భాస్కర్.. విషయం ఏమిటంటే..
ప్రముఖ దర్శకుడు రాజ్ కుమార్ హిరానిని పెళ్లిచూపులు, ఈ నగరానికి ఏమైంది చిత్రాల దర్శకుడు తరుణ్ భాస్కర్ గత శుక్రవారం కలుసుకొన్నారు. తరుణ్ భాస్కర్ రూపొందించిన ఈ నగరానికి ఏమైంది చిత్రం జూన్ 29న రిలీజైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ముంబైలో ప్రత్యేకంగా ఓ ప్రీమియర్ షోను ప్రదర్శించారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ హిరానీని కలుసుకొన్నారు.
ఈ సందర్భంగా హిరాని, తరుణ్ భాస్కర్ మధ్య తమ రూపొందించిన చిత్రాల ప్రస్తావన వచ్చినట్టు సమాచారం. ఈ సందర్బంగా పెళ్లిచూపులు చిత్రంపై హిరాని ప్రశంసల వర్షం కురిపించినట్టు తెలిసింది. ఈ సమావేశంలో హిరానికి కొన్ని కథలకు సంబంధించిన ఐడియాలను వినిపించినట్టు సినీ వర్గాలు పేర్కొన్నాయి.
సంజయ్ దత్ జీవిత కథ ఆధారంగా దర్శక, నిర్మాత రాజ్ కుమార్ హిరానీ రూపొందించిన సంజు చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టిస్తున్నది. కేవలం మూడు రోజుల్లోనే రూ.100 కోట్లకు పైగా సాధించింది. హిందీలో బాహుబలి, దంగల్ చిత్రాల రికార్డులను తిరగరాస్తున్నది.